Maheshbabu : రాజమౌళి స్క్రిప్ట్ పై మహేష్ అసంతృప్తి.. కారణం

Maheshbabu : మహేష్ బాబు – రాజమౌళి కాంబో మూవీ పై ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ప్రేక్షకులను ఆసక్తి పరుస్తున్న విషయం తెలిసిందే.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు – రాజమౌళి స్క్రిప్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ విషయం మహేష్ బాబు అభిమానులను అసహనానికి గురిచేస్తుందనే వార్తలు తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అలాంటి రాజమౌళి స్క్రిప్ట్ నే మహేష్ బాబు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇక ఈయనకు ఎలాంటి కథ తేవాలో అంటూ మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

రాజమౌళి స్క్రిప్ట్ మెచ్చని మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు.. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తయినట్టుగా రాజమౌళి వెల్లడించారు.. అయితే స్క్రిప్ట్ కూడా తుది దశకు చేరుకుంది.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాబోతున్నాయి అంటూ రాజమౌళి మీడియాతో చెప్పగా అయితే రాజమౌళి నెరేట్ చేసిన స్క్రిప్ట్ ఇప్పుడు మహేష్ బాబుకు నచ్చలేదని సమాచారం. ఇకపోతే ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి గానూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.. స్క్రీన్ ప్లే రాజమౌళి తన టీం తో కలిసి సిద్ధం చేశారు.. ఫైనల్ స్క్రిప్టు మహేష్ బాబుకి రాజమౌళి నెరేట్ చేయగా ఆయన సంతృప్తి పడలేదట.. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించగా మహేష్ సూచనల మేరకు రాజమౌళి స్క్రిప్టులో కాస్త మార్పులు చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి క్రేజ్ ప్రపంచ దేశాలకు పాకి పోవడంతో ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.. రాజమౌళి అందుకే యూనివర్సల్ సబ్జెక్టుని ఆయన ఎంచుకున్నారు.. అందులో భాగంగానే మహేష్ బాబు కట్ అవుట్ కి.. ఆయన నటన విధానానికి సెట్ అయ్యే విధంగా జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఇకపోతే ఇందులో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే యోధుడి పాత్రలో కనిపిస్తారట. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి నేరుగా ఈ విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

భారీ బడ్జెట్ తో ఎస్.ఎస్.ఎం.బీ.29..

రాజమౌళి కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.. రాజమౌళి కూడా చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్న తన టీమ్లో కూడా ఇప్పుడు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలను ఏర్పరుస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు