Tollywood: ఆ స్టార్ హీరోతో కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్…మైండ్ బ్లాక్ అయ్యే కాంబో…!

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు క‌ల్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ న‌టుడిగా ఈ సినిమాకు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమాతోనే మాస్ ఆడియ‌న్స్ కు కూడా క‌ల్యాణ్ రామ్ ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కాబోతంది. న‌వీన్ మేడారం ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా క‌నిపించ‌నున్నాడు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఇదిలా ఉంటే తాజాగా క‌ల్యాణ్ రామ్ త‌దుప‌రి సినిమాపై నెట్టింట ఆస‌క్తిక‌ర వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ త‌దుప‌రి సినిమా మ‌ల్టీ స్టారర్ గా రాబోతుంద‌ని స‌మాచారం. అంతే కాకుండా ఈ చిత్రంలో త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి మ‌రో హీరోగా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ద‌యా లాంటి సూప‌ర్ హిట్ వెబ్ సిరీన్ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతుంద‌ని స‌మాచారం.

బింబిసారతో క‌ల్యాణ్ రామ్ దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తి త‌మిళ న‌టుడు అయిన‌ప్ప‌టికీ అన్ని ర‌కాల పాత్ర‌ల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రాబోయే సినిమా ప‌క్కా పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కే అవ‌కాశం ఉంది. ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు