Bahubali: బాహుబలి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్.. వీడియో తో సహా..!

Bahubali..తెలుగు సినీ ఇండస్ట్రీని మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చేసిన సినిమా బాహుబలి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళి.. ఈయన వల్లే ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించగా.. అనేక రికార్డులను కూడా సృష్టించాయి.. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో హాలీవుడ్ సినిమాలను సైతం ప్రశంసలు అందుకునేలా చేసింది బాహుబలి చిత్రం. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్ల మార్కుని సాధించిన మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.

Bahubali: Kicking update for Bahubali fans.. including video..!
Bahubali: Kicking update for Bahubali fans.. including video..!

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి..

రాజమౌళి తన మేకింగ్ తో హాలీవుడ్ మేకర్స్ ని సైతం ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్, రానా, అనుష్క ,తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితర నటీనటులు సైతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి నటనతో ప్రశంసలు కూడా అందుకున్నారు. అందుకే ఇప్పటికి బాహుబలి 1,2 చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం. హిందీ , తమిళ్, కన్నడ , మలయాళం ఇతర భాషలలో కూడా ఈ రేంజ్ లో ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు రాలేదు.

బాహుబలి వెబ్ సిరీస్..

కేవలం మళ్ళీ బాహుబలి సినిమా రిలీజ్ చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అయితే ఈసారి బాహుబలి యానిమేషన్ తో యూనైటెడ్ సిరీస్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.. అందుకే బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ ని డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ఒక వీడియోతో సహా ప్రకటించడం జరిగింది. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోందంటూ రాజమౌళి తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.. అతడి పేరును మాహిష్మతి ప్రజలు పలుకుతూ ఉంటే అలాంటి యోధుడిని ప్రపంచంలో ఏ శక్తి కూడా అడ్డుకోలేదంటూ.. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ రాసుకొచ్చారు.

- Advertisement -

చిన్న టీజర్ తోనే హింట్..

అయితే కేవలం చిన్న టీజర్ తో మాత్రమే.. రాజమౌళి ఇది చూపించారు.. ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇంతకుమించి ఎలాంటి వివరాలను కూడా తెలియజేయలేదు.. మరి ట్రైలర్ విడుదలయ్యాక అన్ని విషయాలను చిత్ర బృందం వెల్లడిస్తుందేమో చూడాలి మరి. ముఖ్యంగా ఈ యానిమేటెడ్ సిరీస్ ను థియేటర్లో విడుదల చేస్తారా? లేకపోతే ఏదైనా ఓటీటీలో విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా బాహుబలి ఫ్యాన్స్ కి సైతం కిక్కెక్కించే అప్డేట్ ని సైతం రాజమౌళి ఇచ్చారని చెప్పవచ్చు.

రాజమౌళి సినిమాలు..

ప్రస్తుతం రాజమౌళి ,మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 అనే అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా.. పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.. ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకి కూడా పాన్ వరల్డ్ గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి అయితే రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా కాదు పాన్ వరల్డ్ గా మార్చబోతున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు