Samantha: అదే నా లవ్ అంటూ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరయిన్ సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్ సమంత. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దూసుకుపోతోంది. ఈ మధ్య మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి సోకినప్పటికీ కూడా సినిమాలు చేసేసింది హీరోయిన్ సమంత. అలా డెడికేటింగ్ గా వర్క్ చేస్తున్న సమంత… ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గానే కొనసాగుతోంది.

నాగచైతన్య తో విడాకులు

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. దాదాపు 14 సంవత్సరాల కిందట వచ్చిన ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఏం మాయ చేసావే సినిమాలో హీరోగా నాగచైతన్య చేయగా ఆయన సరసన సమంత నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అక్కినేని నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారు.

- Advertisement -

దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2017 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అలా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాపురం చేశారు. కానీ పిల్లలను మాత్రం కనలేదు నాగచైతన్య మరియు సమంత. ఈ తరుణంలోనే 2021 సంవత్సరం డిసెంబర్లో సమంత,నాగచైతన్య విడిపోయారు. ఎలాంటి చెప్పకుండానే సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.

ఓ మై లవ్ అంటూ పోస్ట్ !

మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్న సమంత… అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన అంద చందాలను ఆరబోస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే సమంత మరియు వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ సెటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే ముంబైలో జరిగినవో కార్యక్రమంలో సమంత హాజరయ్యారు.

ఈ సమావేశానికి హీరోయిన్ తమన్నా కూడా హాజరయ్యారు. ఈ తరుణంలోనే విజయవర్మ ఫోటోలు తీస్తున్నప్పుడు తమన్నా మరియు సమంత ఫోజులు ఇచ్చారు. ఇక వీటిని సమంత సోషల్ మీడియాలో ఓ మై లవ్ అనే క్యాప్షన్ తో షేర్ చేసింది సమంత. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు