OmBheemBush : రిలీజ్ కి ముందే ఎట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్లు..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఇంకా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓంభీంబుష్’ మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేయగా సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఓం భీం బుష్ ట్రైలర్ లో హీరోల కంటే హీరోయిన్లు తెగ అట్రాక్ట్ చేస్తుండడం విశేషం. ఈ ట్రైలర్ లో నలుగురు హీరోయిన్లు కనిపించగా, వాళ్ళందరూ ఒక్కో షాట్ తో మాత్రమే కనిపించి వెళ్లారు. అయినా సరే ఆ భామలు ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందులో ఓ ఇద్దర్ని ఆడియన్స్ గుర్తుపట్టగా, మరో ఇద్దరు కొత్త భామలు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరోయిన్లు ట్రెండ్ అవుతున్నారు. టాలీవుడ్ యూత్ ఆ హీరోయిన్ల గురించి రిలీజ్ కి ముందే ఆరా తీయడం స్టార్ట్ చేసారు. అంతగా అట్రాక్ట్ చేస్తున్న ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం..

ప్రీతీ ముకుందన్..

మలయాళం ఇండస్ట్రీ కి చెందిన ప్రీతి ముకుందన్ పేరు ఇకపై టాలీవుడ్‌లో బాగా వినిపించేలా ఉంది. ఓం భీం బుష్ తో హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ భామ అంతకు ముందే మంచు విష్ణు కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ ఇప్పుడు ఓం భీం బుష్ ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమానే అఫిషియల్ గా ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో ప్రీతి ముకుందన్ తన అందంతో అందరినీ కట్టి పడేసింది. కేవలం 10 సెకెన్ల పాటు ట్రైలర్ లో కనిపించగా, ఆ షాట్స్ లో లంగా వోణిలో కాలేజ్ అమ్మాయిగా ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసింది. సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి మాత్రం బిజీ అవడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -

ప్రియా వడ్లమాని..

టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద వచ్చిన సూపర్ హిట్ చిత్రం హుషారు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా వడ్లమాని అప్పట్లోనే బాగా ఫేమస్ అయింది. హుషారుతో ప్రియా వడ్లమానికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ క్రేజ్‌ను ఆఫర్లుగా మార్చుకోలేకపోయింది ఈ భామ. ఇప్పుడు అదే హుషారు సినిమా తీసిన హర్ష ఓం భీం బుష్ అంటూ రాబోతోన్నాడు. ఈ సినిమాలో మళ్ళీ సెంటిమెంట్‌గా ప్రియా వడ్లమానికి ఓ స్పెషల్ రోల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ట్రైలర్ లో అలా ఒక్క షాట్ లోనే కనిపించడం తో బహుశా చిన్న రోల్ అయి ఉంటుందని అనుకోవచ్చు.

కామాక్షి భాస్కర్ల..

పొలిమేర సినిమా లో చూసిన కామాక్షి భాస్కర్లను ఆడియన్స్ అంత తేలిగ్గా మర్చిపోరు. ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించిన కామాక్షి నిజానికి చాలా బ్యూటీఫుల్ గా ఉంటుంది. డాక్టర్ కమ్ యాక్టర్ అయిన ఈ కామాక్షి ఇప్పుడు ఓం భీం బుష్ అంటూ పలకరించబోతోంది. అయితే ఇందులో కాస్త హాట్ అండ్ బోల్డ్ పాత్రలో నటించినట్టుగా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంది. ఈమె కూడా ఒకే ఒక్క షాట్‌లో కనిపిస్తుంది. మరి సినిమాలో ఎలాంటి రోల్ లో మెప్పిస్తుందో చూడాలి.

ఆయేషా ఖాన్..

హిందీ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన భామ ఆయేషా ఖాన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఓం భీం బుష్ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఈమె అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ముఖ చిత్రం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. దాంతో పాటు విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో కూడా కీ రోల్ లో నటించింది. ఇక ఇప్పుడు ఓం భీం బుష్ తో ఆడియన్స్ ని పలకరించడానికి వస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో అందరికంటే ఎక్కువగా ఆడియన్స్ ని ఆకర్షించింది మాత్రం ప్రీతీ ముకుందన్ అని చెప్పాలి. మూవీ హిట్ అయితే ఆమె కి మాత్రం టాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు రావడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు