Dhoni Entertainment : భారీగా ఫస్ట్ ప్రాజెక్ట్

మన దేశంలో క్రికెట్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఇతని తర్వాత వినిపించే పేరు.. మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ కు ప్రాతినిథ్యం వహించిన ధోని.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు లక్షలాది మంది ఫ్యాన్స్ నూ సంపాదించుకున్నాడు. అయితే మహి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత.. ఎక్కువగా బిజినెస్ పనులు చూసుకుంటున్నాడు.

ఇప్పటి వరకు ధోని.. రేసింగ్, ఫుట్ బాల్, ఫుట్ వేర్, హాకీ టీమ్ తో పాటు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు. తాజాగా మరో రంగంలోకి అడుగు పెట్టడానికి ధోని సిద్ధమవుతున్నాడు. ధోని ఎంటర్ టైన్ మెంట్స్ అనే పేరుతో సినిమాలను నిర్మించాలని ఈ మిస్టర్ కూల్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినీ నిర్మాణ సంస్థ సౌత్ ప్రేక్షకుల కోసమే పని చేస్తుందని తెలుస్తుంది. సినిమా నిర్మాణ రంగంలోకి ధోని వస్తాడని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా ధోని తన ప్రొడ్యూసింగ్ బ్యానర్ పేరు ను కూడా అనౌన్స్ చేశాడు.

ధోని ఎంటర్ టైన్ మెంట్స్ లో వచ్చే మొదటి సినిమా ఏమై ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్ వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ధోని ఎంటర్ టైన్ మెంట్స్ వచ్చే మొదటి సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. క్రికెట్ లో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకుని ఎన్నో రికార్డులను నమోదు చేసిన ధోని, సినీ నిర్మాణ రంగంలో ఎలాంటి మైలురాళ్లను క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు