Pooja Hegde Career : ఆ హీరోతో పెట్టుకుని కెరీర్‌ని తానే నాశనం చేసుకుందా..? బుట్టబొమ్మ దయనీయమైన కథ

Pooja Hegde Career : బుట్ట బొమ్మ పూజా హెగ్డేకి చాలా కాలం నుంచి బ్యాడ్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో హీరోతో ఈ బ్యూటీ కెరీర్ ని ముడిపెట్టి ఫన్నీ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. అతనితో సినిమా చేశాక ఈ హీరోయిన్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బుట్ట బొమ్మ ఏ హీరోతో పెట్టుకుని కెరీర్ ను నాశనం చేసుకుంది ? అనే వివరాల్లోకి వెళితే…

పెద్ద పెద్ద హిట్లతో దూసుకుపోతున్న టైంలో అయ్యగారితో ఒకే ఒక్క మూవీ చేసి కెరీర్ ను నాశనం చేసుకుంది పూజా హెగ్డే. అప్పటి నుంచి ఒక్క హిట్ కూడా లేదు… ఈ మాటలు అంటున్నది ట్రోలర్లు. ఒకరకంగా చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తుంది. వీళ్ళు కామెంట్స్ చేస్తోంది అక్కినేని వారసుడు అఖిల్ గురించే. ఆయన సినిమా చేశాక పూజా హెగ్డే కెరీర్ పూర్తిగా నాశనం అయ్యింది అనేది ఈ ట్రోలర్ల ఉద్దేశం. ఆయనతో సినిమా చేయడానికంటే ముందు పూజా హెగ్డే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీతో అప్పటిదాకా హిట్స్ లేక సతమతం అవుతున్న అఖిల్ కి బ్లాక్ బస్టర్ హిట్టునైతే ఇచ్చింది గాని, ఆ తర్వాత అతని బ్యాడ్ లక్ ఈ బ్యూటీకి కూడా చుట్టుకుంది. అప్పటినుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత కూడా పూజా హెగ్డే కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు.

అక్కినేని అఖిల్ తో సినిమా చేయడానికంటే ముందు పూజా అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటించింది. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేకు తర్వాత నుంచి కష్టకాలం మొదలైంది. రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది కాబట్టి ఇక పూజాకు తిరుగులేదు అని అనుకుంటుండగా, ఆ మూవీ బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత ఆమె నటించిన బీస్ట్, ఆచార్య, ఎఫ్ 3 మూడు సినిమాలు కూడా ప్లాఫ్ గానే నిలిచి షాక్ ఇచ్చాయి.

- Advertisement -

టాలీవుడ్ ఎలాగో కలిసి రాలేదు కనీసం బాలీవుడ్ లోనైనా లక్ పరీక్షించుకుందాం అనే ఆశతో ఈ మధ్యలో అక్కడ కూడా రెండు సినిమాల్లో నటించింది. సర్కస్ చేసింది. అది పెద్దగా ఆడలేదు. ఇక కిసికా భాయ్ కిసికా జాన్ అంటూ ఏకంగా సల్మాన్ తో జత కట్టేసింది. కానీ అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. అఖిల్ తో సినిమా చేసినప్పుడు పట్టుకున్న బాడ్ లక్ ఇప్పటిదాకా పూజాను వదిలిపెట్టలేదు. మరోవైపు అఖిల్ కి కూడా ఆ తర్వాత ఏజెంట్ మూవీతో కోలుకోలేని దెబ్బ పడింది. ప్రస్తుతం పూజ చేతిలో ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా సినిమాలేవి లేవు. ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన సినిమా అంటే బాలీవుడ్ లో దేవా మాత్రమే.

కెరీర్ లో ఎంతో సాఫీగా నడుస్తున్న టైంలో అఖిల్‌తో స్క్రిన్ పంచుకోవడంతో బుట్ట బొమ్మ దయనీయమైన కథ స్టార్ట్ అయింది అంటూ ట్రోలర్స్ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు