Garikapati : ఆజ్యం పోస్తున్న ఆర్జీవీ

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా హర్యాణ గవర్నర్ బండారు దత్తత్రాయ అలయ్-బలయ్ కార్యక్రమం నిర్వహిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా దత్తత్రాయ అలయ్- బలయ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వెళ్లాడు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి పై గరికపాటి నరసింహ రావు కొంత వరకు అసహాననాకి గుర అయ్యాడు. చిరంజీవి ఫోటో సెషన్ ముగించేస్తే తాను మాట్లాడుతానని, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యానించాడు.

దీనిపై మెగా అభిమానులు ఘాటుగానే స్పందించారు. చిరంజీవి క్రేజ్ చూసి ఈర్ష్య‌తో గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ అయ్యారు. మ‌రోవైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించి ట్విట్టర్ వేదికగా గరికపాటికి చురకలు అంటించాడు. కొంత సమయం తర్వాత నాగబాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. కానీ మెగా అభిమానులు మాత్రం గరికపాటి పై కాస్త గ‌రం గ‌రంగానే ఉన్నారు.

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వివాదంపై తన స్టైల్ లో స్పందించాడు. “సర్ నాగబాబు గారు మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు. సర్ నాగబాబు గారు ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్” అంటూ వర్మ ట్విట్టర్ వేదికగా గరికపాటిపై ఫైర్ అయ్యారు. అంతేకాదు.. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి నువ్వే తెలుసుకో అని పేర్కొన్నాడు వ‌ర్మ‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు