Chiranjeevi
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.. ముఖ్యంగా మెగాస్టార్ అంటే ఆయన చూపు పడితే చాలు అన్నట్టుగా చాలామంది సెలబ్రిటీలు కూడా ఎదురు చేస్తూ ఉంటారు.. అటువంటిది చిరంజీవి తనకు మెచ్చిన నటుడు గురించి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.. మరి చిరంజీవి మెచ్చిన నటుడు ఎవరు ? ఆయనను మెప్పించిన ఆ విలక్షణ నటుడు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం.. నట శిఖరంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు.
ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ హీరోగా ఎదిగాడు.. అంతేకాదు తనతో పాటు తన కుటుంబంలో హీరోలను తయారు చేసి ఇండియాలోనే అతిపెద్ద సినిమా కుటుంబం గా మెగా ఫ్యామిలీని తయారు చేశారు చిరంజీవి.. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి పెద్దన్నగా నడిపిస్తున్నారు. ఇక ఇంత చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో తనకు ఎస్.వి.ఆర్ , ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి వారి నటన అంటే ఇష్టమని చెప్పారు.. కానీ ఇప్పుడు ఉన్న విలక్షణ నటులలో ఆయన మెచ్చిన నటుడు ఎవరంటే ప్రకాష్ రాజ్.. అవును.. ప్రకాష్ రాజ్ నటన అంటే చిరంజీవికి చాలా ఇష్టమట.. పలు సందర్భాలలో చిరంజీవి చెప్పిన మాటలు ఇవి..
ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నారు ఏ పాత్ర అయినా సరే ఆయనకు సరిపోయేలా మలుచుకునే విధానం చిరంజీవికి ఎంతో నచ్చుతుందట. విలన్ గా , తండ్రిగా , తాతగా , కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు చేశారు ప్రకాష్ రాజ్ .. ఒకప్పుడు తన పక్కన హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణకు గుంటూరు కారం సినిమాలో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయనను ఇష్టపడతారు.. ఇకపోతే ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ ను మెచ్చినట్లు సమాచారం.. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు..ప్రస్తుతం పాలిటిక్స్ మీద ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరు సరసన ఆమె నటిస్తోంది. 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఈ తేదీని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.