Chiranjeevi : శ్రీమతితో కలిసి చిరు సమ్మర్ వెకేషన్ ప్లాన్… ఎక్కడికి వెళ్ళబోతున్నారంటే?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలకు స్పీడ్ బ్రేక్ వేశారు. నిన్న మొన్నటిదాకా ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసిన చిరు ఇప్పుడు జోరు తగ్గించి ఒక మూవీ పూర్తయ్యాక మరో మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ప్రస్తుతం తన కాన్సన్ట్రేషన్ అంతా “విశ్వంభర” మూవీపైనే పెట్టారు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి తన శ్రీమతితో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట చిరు. మరి ఇంతకీ ఈ దంపతులిద్దరూ సమ్మర్ ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈసారి అమెరికాకు కాదు…

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమ్మర్ కి మెగా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రీసెంట్ గా చిరు చిన్న ట్రిప్ లో భాగంగా అమెరికా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా కాస్త లాంగ్ వెకేషన్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే తన కుటుంబంతో కలిసి చిరు ఏప్రిల్ లో సమ్మర్ వెకేషన్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా వెకేషన్ అనగానే సెలబ్రిటీలు అంతా విదేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే మెగాస్టార్ కూడా ఈ సమ్మర్ వెకేషన్ ను విదేశాల్లోనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారట. సినిమాల కోసం ఇప్పటికే ఆయన అమెరికా వంటి చాలా దేశాలను సందర్శించారు. అందుకే ఈసారి యూరప్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్, హాలిడేస్ అంటూ ఇప్పటికే పలు యూరోపియన్ దేశాలను సందర్శించిన చిరు, యూరప్ లో తాను ఇప్పటిదాకా చూడని ఒక కొత్త ప్రదేశాన్ని ఈ వెకేషన్ లో భాగంగా విజిట్ చేయాలని అనుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. తన శ్రీమతి సురేఖతో కలిసి అద్భుతమైన మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం కోసమే చిరు ఇలా సమ్మర్ వెకేషన్ కోసం సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలా టైం కుదుర్చుకొని మరీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు మెగాస్టార్. అటు సినిమాలతో పాటు, ఇటు ఫ్యామిలీకి కూడా సమ ప్రాధాన్యతను ఇస్తూ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నారు.

చిరు సినిమాల విషయానికొస్తే…

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” మూవీతో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ కోసం వేసిన భారీ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. 2025 జనవరి 10న “విశ్వంభర” మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం రవితేజతో “మిస్టర్ బచ్చన్” అనే మూవీ చేస్తున్నారు హరీష్ శంకర్. ఈ మూవీ పూర్తవ్వగానే ఇటు హరీష్, అటు ‘విశ్వంభర” పూర్తయిన వెంటనే చిరు ఫ్రీ అవుతారు. అప్పుడు ఇద్దరు కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. చిరు, హరీష్ ప్రాజెక్ట్ ను ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి నిర్మించబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు