Captain Miller: ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్?

Captain Miller Releasing in Highest Screens

కోలీవుడ్ స్టార్ ధనుష్ మంచి ఊపుమీదున్నాడు. ఈ ఇయర్ “సార్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో రానున్నాడు. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోగా, త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. ప్రియంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ధనుష్ ఒక వైవిధ్యమైన రోల్ ని ప్లే చేస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా గురించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ తో ధనుష్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుందన్న విషయం తెలిసిందే. కెప్టెన్ మిల్లర్ సినిమాను ధనుష్ కెరీర్లోనే అత్యధికంగా 3500 స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది. సౌత్ తో పాటు, హిందీలోనూ మంచి క్రేజ్ ఉన్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.

ఇక కెప్టెన్ మిల్లర్ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా కీలకపాత్రలో నటించగా, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ విలన్ గా నటిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తరువాత అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృత గా వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు