A.R. Murugadoss : స్టార్ హీరోలతో మల్టీస్టారర్?

స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ చలన చిత్ర పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడు. అజిత్ కుమార్, విజయ్ కాంత్, సూర్య, చిరంజీవి వంటి అగ్ర హీరోలకు దర్శకత్వం వహించాడు మురుగదాస్. సూర్య హీరోగా నటించిన గజిని చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నాడు మురుగదాస్. అయితే ఈ స్టార్ డైరెక్టర్ రజనీకాంత్ తో ఇటీవల చేసిన దర్బార్ చిత్రం నిరాశపరిచింది. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య విజయ్ హీరోగా ఓ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. కానీ మురుగదాస్ కు విజయ్ ఛాన్స్ ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిసింది.

ఈ నేపథ్యంలో మురుగదాస్ తన తదుపరి చిత్రం ఏమిటనేది సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మురుగదాస్ చియాన్ విక్రమ్ – విజయ్ సేతుపతి లతో ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మల్టీ స్టారర్ మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పిస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి.

ఇక చియాన్ విక్రమ్ ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తో మహాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జోడీ గా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందన్న వార్తలతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు