Sankranthi2025 : పండగ బరిలో లేటెస్ట్ గా.. అరడజను సినిమాలు..

టాలీవుడ్ లో సినిమాల పోటీ సీజన్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి పండగే. ఈ పండగ లో పోటీగా నిలవడం కోసం పెద్ద పెద్ద సినిమాలు కూడా ఏడాదికి ముందు నుండే రిలీజ్ డేట్లపై ఖర్చీఫ్ వేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అరడజను సినిమాలు నిలిస్తే థియేటర్ల సమస్య వల్ల రెండు సినిమాల్ని పోటీ నుండి తప్పించాల్సి వచ్చిందని తెలిసిందే. పైగా పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారని ఎప్పటికప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుండి భారీ చిత్రాలు పొంగల్ బరి లో నిలవడానికి రెడీ అయ్యాయి. అందులో సినిమా ఓపెనింగ్ డే రోజే సంక్రాంతికి వచ్చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలో ఇప్పటికే ఫిక్స్ అయిన ఆ సినిమాలపై ఒక్క్కసారి లుక్కేద్దాం..

మెగాస్టార్ తోనే మొదలు..

మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర సినిమా అందరికంటే ముందు అఫిషియల్ గా సంక్రాంతికి వస్తున్నామని మేకర్స్ టైటిల్ ప్రకటించినపుడే అనౌన్స్ చేయడం జరిగింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ జోనర్ లో తెరకెక్కతుండగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

వెంకీ అనిల్ రావిపూడి..

టాలీవుడ్ లో వెంకటేష్ అనిల్ రావిపూడి ది సక్సెస్ ఫుల్ కాంబో. ఇప్పుడు వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఆ టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామని అనౌన్స్ చేసారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో క్రేజీ అంచనాలున్నాయి.

లేటెస్ట్ మైత్రీ-అజిత్ సినిమా..

లేటెస్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న అజిత్ కొత్త సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. ‘గుడ్ బాడ్ అగ్లీ’ పేరుతో తెరకెక్కబోయే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జులై లో మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నాగార్జున కొత్త సినిమా..

ఈ సంక్రాంతికి నాగార్జున నా సామి రంగ తో వచ్చి మంచి హిట్టు కొట్టగా ఆ సినిమా సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని కింగ్ నాగార్జున చెప్పడం జరిగింది. అంటే వచ్చే సంక్రాంతికి సెంటిమెంట్ గా దాదాపుగా కొత్త సినిమా దించడం ఖాయమని చెప్పాలి.

దిల్ రాజు శతమానంభవతి 2

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో వచ్చిన శతమానం భవతి ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల కింద సంక్రాంతికే వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు శతమానం భవతికి సీక్వెల్ గా సినిమా రానుందని దిల్ రాజు అనౌన్స్ చేయగా, ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఈ సీక్వెల్ లో శర్వానంద్ కాకుండా వేరే హీరో నటించే అవకాశం ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, రాజా సాబ్ సంక్రాంతికి రావచ్చేమో అని రీసెంట్ గా ఈ సినిమా నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే అది కల్కి రిలీజ్ అయ్యాకే పక్కాగా చెప్పగలం. ఇక రాజాసాబ్ ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయం తెలిసిందే.

ఇవే గాక ఈ ఇయర్ రావాల్సిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు వాయిదా పడితే వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు