Vishwambhara : అనౌన్స్ చేసిన ఆరు నెలలకు సెట్స్ లో ఎంట్రీ.. మరి టైముకొస్తాడా?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో విశ్వంభర ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తునాడన్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. పంచ భూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు ఆరు నెలల క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మాత్రం ఆలస్యం అయ్యాయి. తాజాగా సంక్రాంతి పండగ అయ్యాక అఫిషియల్ గా షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్ ముందుగా ఆక్షన్ ఎపిసోడ్లపైనే దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్ లోకి చిరంజీవి తాజాగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వచ్చీ రావడంతోనే రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పలు ఆక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అయితే విశ్వంభర 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారన్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇప్పుడే మొదలయింది. చిరు లేని సీన్లు ముందుగా షూట్ చేసినా మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడే కాబట్టి ఏడాది లోపల సినిమా పూర్తవుతుందా అనేది నెటిజన్ల అనుమానం. ఎందుకంటే తీసేది సోషియో ఫాంటసీ జోనర్ చిత్రం కాబట్టి, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ టెక్నికల్ వర్క్ కే ఎక్కువ సమయం అవుతుంది. రీసెంట్ గా వచ్చిన హనుమాన్, ఆది పురుష్ సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ కి ఎంత టైం పట్టిందో తెలిసిందే. మరి చిరు సీన్లు ఈ ఇయర్ ఎండింగ్ లోనే పూర్తయినా, వచ్చే సంక్రాంతి కల్లా సినిమా వస్తుందా లేదా అన్నది అనుమానం. అయితే లేటయినా పర్లేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాయే కావాలని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి చూడాలి విశ్వంభర షూటింగ్ ఎంత నిర్విరామంగా చేస్తారో.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు