Biggboss season7: తప్పు ప్రశాంత్ ది.. ఫలితం శోభాది?

బిగ్ బాస్ సీజన్ 7 లో గత రెండు రోజుల నుండి ఎవిక్షన్ పాస్ అనే టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో టాప్ 10 లో చివరి ఐదుగురి నుండి స్టార్ట్ అయిన ఈ టాస్క్ లో ముందుగా అంబటి అర్జున్ గెలవగా, ఆ తర్వాత నుండి యావర్ గెలుస్తూ వస్తున్నాడు. ఇక స్కూటీ నంబర్ ప్లేట్ ఛాలెంజ్ లో అలాగే, లవ్ బర్గర్ ఛాలెంజ్ లో కూడా యావర్ గెలవగా, తాజాగా యావర్ తో శివాజీ, ప్రియాంక ఓ పోటీలో ఆడాల్సి వచ్చింది.

అయితే ఈ పోటీకి ప్రశాంత్, అలాగే శోభా శెట్టి సంచాలక్ గా వ్యవహరించారు. విల్లు పై బాల్స్ ని ఎక్కువ సేపు ఉంచాలని ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పగా, ఈ టాస్క్ లో కూడా యావర్ విజేతగా నిలిచాడు. అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ప్రశాంత్ తన మాటలతో ఆడుతున్న వారిని గట్టిగా హెచ్చరిస్తూ ఒక రకంగా డిస్ట్రబ్ చేసాడు. ఆ విధంగా శివాజీ తన ఆటని వదిలేసాక ప్రశాంత్ పై కోప్పడ్డాడు.

ఇక గేమ్ ఫినిష్ అయిన తర్వాత ఆటలో విన్నర్ ఎవరో డిసైడ్ చేయడానికి ఇద్దరు సంచాలక్ లు చాలా టైం తీసుకున్నారు. అయితే వీళ్ళలో ప్రశాంత్ కి ఆట గురించి పెద్దగా తెలియదని ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కి కూడా తెలుసు. కానీ శోభా కూడా ఇంత టైం తీసుకోవడం, పైగా మూడు సార్లు తన డెసిషన్ చేంజ్ చేయడం పట్ల శివాజీ సీరియస్ అయ్యాడు. అయితే కాసేపు శోభా కూడా వాదించినా, అందరూ ఏకపక్షమయ్యేసరికి సైలెంట్ అయ్యింది.

- Advertisement -

అయితే ఇక్కడ తప్పు ప్రశాంత్ ది. ఆటలో డిస్టర్బ్ చేయడం ఒక తప్పైతే, తప్పు డెసిషన్ చెప్పడం మరో తప్పు. ఆటలో కన్ఫ్యూజ్ అయినప్పుడు సైలెంట్ గా ఉండాల్సింది పోయి, తనకి అంతా తెలుసు అని బిహేవ్ చేయడం అన్నిటికంటే పెద్ద మిస్టేక్. ఏది ఏమైనా ఇక్కడ ఆట లో ప్రశాంత్ ది తప్పైతే ఫలితం శోభా అనుభవించింది అని చెప్పొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు