Samantha : ఇకపై ప్రేమలో పడను

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని నాగ చైతన్యతో “ఏం మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చివరికి నాగ చైతన్యనే ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు అన్యోన్యంగా సాగిన వీరి పెళ్లి బంధం 2021లో డైవర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎందుకు విడిపోయారు అనే కారణం మాత్రం ఇప్పటి వరకు తెలయదు. నాగ చైతన్యను, సమంతను కొన్ని ఇంటర్యూల్లో ఈ ప్రశ్నలు వచ్చినా సమాధానాలు మాత్రం వీరి దగ్గర నుంది రాలేదు.

సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ అనే షోకు వెళ్లిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో సమంత ఈ షోలో సందడి చేసింది. కరణ్ షోలో డైవర్స్ గురించి సమంతను కరణ్ కొన్నిప్రశ్నలు వేశాడు. వాటికి సామ్ ఇచ్చిన కొన్ని సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనికి కెమెరా వెనకాల సమాధానం చెబుతానని సామ్ దాటవేసింది. అయితే నాగ చైతన్య ప్రస్తావన లేకుండా కేవలం తన గురించి మాత్రమే చెప్పింది. డైవర్స్ తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డానని, దాని కోసం చాలా బుక్స్ చదివానని తెలిపింది. ఒక బుక్ లో ఉన్న కోటేషన్ చదివిన తర్వాత తాను మళ్లీ నార్మల్ లైఫ్ కు వచ్చానని వివరించింది.

‘కరణ్ సినిమాలు చూసి పెళ్లి జీవితం సాఫీగా ఉంటుందని అనుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత జీవితం కేజీఎఫ్ లా ఉంటుంది’ అంటూ కరణ్ పైనే సెటైర్ వేసింది. ఇక పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఐటెం సాంగ్ ఎందుకు చేశావని కరణ్ అడిగాడు. దీనికి ‘ఊ అంటావా మామ లిరిక్స్ బాగా నచ్చాయి. అది మగవాళ్లపై సెటైర్లు వేసేలా ఉంది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను’ అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తాను మళ్లీ ప్రేమలో పడను అని కూడా చెప్పింది. సామ్ ఈ షోలో కూడా తన జీవితం గురించి మాత్రమే చెప్పింది. కానీ నాగ చైతన్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు