Tamannaah.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే డబ్బు సంపాదిస్తున్నారు బానే ఉంది కానీ తాము ఏ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాము అనే సామాజిక స్పృహలో లేకుండా చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు తమన్నా కూడా చిక్కుల్లో ఇరుక్కుందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తమన్నాకు నోటీసులు..
ఇటు సౌత్ ఇండియాలో.. అటు నార్త్ ఇండియాలో కూడా రాణిస్తున్న నటీమని తమన్నా కి కూడా తాజాగా న్యాయపరమైన నోటీసు వచ్చింది. తమన్నా భాటియా ఒక బెట్టింగ్ యాప్ వాణిజ్య ప్రకటన ప్రచారంలో భాగమైనందుకుగానూ సైబర్ సెల్ నుంచి ఆమెకు నోటీసులు పంపి విచారణకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఎందుకంటే బెట్టింగ్ పేరుతో కార్యకలాపాల నిర్వహించే కొన్ని సంస్థలపై వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులోకి ఈ సంస్థలు క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారాలు చేసేటప్పుడు సరైన ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం.. అది తెలియకుండా తమన్న లాంటి నటులు ఆ సంస్థల వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఇందుకు ప్రధాన కారణం.. ఈ క్రమంలోనే తమన్నా ఇలాంటి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇక తమన్నాతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
గతంలో బన్నీ కూడా..
అయితే తమన్నా ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కోగా.. గతంలో బన్నీ కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఈయన రాపిడో వాణిజ్య ప్రకటన చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు ఎదురయ్యాయి.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని విమర్శించే విధంగా అల్లు అర్జున్ వాణిజ్య ప్రకటన ఉందని.. ఈ ప్రభుత్వ సంస్థని విమర్శించడం తగదని అల్లు అర్జున్ కు న్యాయపరమైన నోటీసులను అప్పట్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా బన్నీ లాగే ఈమె కూడా చిక్కుల్లో ఇరుక్కోవడం గమనార్హం. ఇక వీరే కాదు ఇప్పటికే చాలామంది నటీనటులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
అక్షయ్ కుమార్ కి కూడా తప్పని తిప్పలు..
గతంలో అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.. అతను పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలు చేయడం విమర్శలకు తావు ఇచ్చింది.. టొబాకో బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వల్ల అభిమానులు కూడా వీరిని తీవ్రంగా విమర్శించారు.. ఒక పక్క సినిమా ప్రారంభం అయ్యే ముందు థియేటర్ లలో సిగరెట్ ,పాన్ మసాలా వంటివి తీసుకోవడం హానికరం అంటూ చెప్పి.. మళ్లీ అదే నటులు వాటిని ప్రమోట్ చేయడానికి వాణిజ్య ప్రకటనలో కనిపించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చివరిగా అక్షయ్ కుమార్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పి.. ఇకపై ఇలాంటి వాటిని ప్రమోట్ చేయను అని స్పష్టం చేశారు. మొత్తానికి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో తమ తప్పిదం లేకుండానే వాణిజ్య ప్రకటనలు చేసి ఇలా చిక్కుల్లో పడుతూ ఉంటారు సెలబ్రిటీలు.