Varalakshmi Sarath kumar.. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవలే తను ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత తరచూ సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన విషయాల పై కాకుండా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేస్తూ వస్తోంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తాజాగా తాను లైంగికంగా వేధింపులకు గురయ్యాననే విషయాన్ని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది.. వాటి గురించి చూద్దాం.
తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎన్నో విలన్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. మరో వైపు హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది హనుమాన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు తాజాగా శబరి అనే సినిమాలో నటించింది ఈ సినిమా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు విషయాలను తెలిపింది. ముఖ్యంగా తన పెళ్లి కూడా ఈయేడాదే ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది..
శబరి సినిమా కథ లీక్..
శబరి సినిమాకు సంబంధించి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా ఇంతకుముందు తాను ఎప్పుడూ కూడా చేయలేదని.. ఈ చిత్రంలో తను ఒక తల్లి పాత్రలో నటిస్తున్నానని.. తల్లి కూతుర్ని ఎలా కాపాడుకుంటుంది అనే కథాంశం తోనే ఈ సినిమాను తెరకెక్కించారని కూడా తెలియజేసింది. అలాగే ఇందులో కొన్ని సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయని కూడా వెల్లడించింది వరలక్ష్మి..
లైంగికంగా వేధింపులకు గురయ్యాను..
తన జీవితంలో కూడా చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని.. ఇది తన జీవితంలో ఒక మరచిపోలేని సంఘటన అంటూ తెలియజేసింది. అయితే ఇలాంటి విషయాలను చెప్పడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకే సన్నిహితులు, బంధువుల దగ్గర కూడా చెప్పకుండా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ ఎదుర్కొన్న ఇబ్బందులను ధైర్యంగా సోషల్ మీడియాలో చెబుతున్న నేపథ్యంలో తాను కూడా బయట పెట్టాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ ఎన్ని రోజులు తన మనసులోనే పెట్టుకొని ఎంతో మనోవేదనకు గురయ్యానని చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్ రాజాగా అసలు విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
థెరపిస్ట్ తప్పనిసరి..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది.. కుటుంబ సభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్ని జడ్జ్ చేస్తారు.. అదే థెరపిస్ట్ ఉంటే మన సమస్య గురించి వాళ్లే చెబుతారు.. ముఖ్యంగా మన సమస్యను అర్థం చేసుకొని మనల్ని ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చూపిస్తారు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.. మొత్తానికైతే ప్రతి ఒక్కరి జీవితంలో థెరపిస్ట్ అనేవారు అత్యవసరం అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.