Ram Gopal Varma : మరో వివాదాస్పద స్టోరీతో వర్మ

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరికీ సుపరిచతమే. ఒక మంచి డైరెక్టర్ గా ఉన్న వర్మ, ప్రస్తుతం ఒక వివాదాస్పద వ్యక్తిగా మారిపోయాడు. ఏ సినిమా చేసినా, ట్విట్టర్ లో ఏ పోస్టు పెట్టినా ఎక్కడో కాంట్రవర్సీ జరుగుతుంది. అలాగే రామ్ గోపాల్ వర్మను అంచనా వేయడం కూడా కష్టమే. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు. ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో కూడా తెలియదు. వర్మ ఇటీవల మా ఇష్టం అనే సినిమా చేసి దారుణంగా విఫలం అయ్యాడు. అమ్మాయి సినిమా ఇక్కడ పెద్దగా ఆడకపోయినా, అంతర్జాతీయంగా మాత్రం విజయం సాధించింది.

వర్మ తాజాగా ఒక ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. కరోనా మహమ్మారి సమయంలో జరిగిన కొన్ని ఘటనలతో ”కొవిడ్ ఫైల్స్” అనే సినిమా చేస్తానని వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంత మంది ప్రాణాలు పొగుట్టుకున్నారో ఈ కొవిడ్ ఫైల్స్ లో చూపిస్తానని వరుస ట్వీట్లతో తెలిపాడు. వర్మ తెరకెక్కించే సినిమాలు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసినట్టు ఉంటాయి. కొవిడ్ ఫైల్స్ సినిమాతో వర్మ మరి ఎవరినో టార్గెట్ చేశాడో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కరోనా సమయంలో వేలాది మంది చనిపోయారు. రైలు పట్టాలపై, గంగా నదిలో, రోడ్లపై ఇలా ఎక్కడ పడితే అక్కడ శవాలు కనిపించాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్మ సినిమాపై ఇప్పటి నుండి ఆసక్తి పెరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు