బిందు మాధవి. ఈ హీరోయిన్ గురించి ఈ తరం వారికి ఎక్కువగా తెలియక పోవచ్చు. తమిళం లో ఎక్కువగా మూవీస్ చేసే తను తెలుగులో బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ వెలుగులోకొచ్చింది. అయితే బిందు మాధవి ఒక అచ్చ తెలుగమ్మాయి అని చాలా మందికి తెలియదు. మదనపల్లె కి చెందిన బిందు సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ కి వచ్చింది. 2008 లో వచ్చిన ఆవకాయ బిర్యానీ తో పరిచయమైన ఈ భామ బంపర్ ఆఫర్ సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా రామ రామ కృష్ణ కృష్ణ, ఓం శాంతి, ప్రతి రోజు సినిమాలు చేసింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. తెలుగులో చివరగా “పిల్ల జమిందార్” సినిమా లో కనిపించింది.
తెలుగులో ఆఫర్లు రాకపోయినా తమిళం లో ఆఫర్లు రావడం తో ఈ అమ్మడు అక్కడికి షిఫ్ట్ అయిపొయింది. వెప్పం సినిమాతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోగా కేడి బిల్లా కేడి రంగా, “దేసింగు రాజా” సినిమాలతో మంచి జోరు చూపించింది. ఆ తర్వాత ప్లాపులు రావడం తో అక్కడ కూడా అవకాశాలు కరువయ్యాయి. దాంతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కి వచ్చింది.
2022 లో ఓటిటి ప్లాట్ఫామ్ లో ప్రసారమైన “బిగ్ బాస్” నాన్ స్టాప్ షో లో విజేత గా గెలిచి మళ్ళీ పాపులర్ అయింది. దానితో తెలుగులో మళ్ళీ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఈమధ్యనే హాట్ స్టార్ లో “ఆంగర్ టేల్స్” అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఇప్పుడు మరో వెబ్ మూవీ ద్వారా ముందుకువస్తుంది. నవదీప్ హీరోగా బిందు మాధవి మెయిన్ లీడ్ గా “న్యూసెన్స్” అనే వెబ్ మూవీలో నటించింది. ఈ మూవీ మే12న ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. అయితే ఎన్ని వెబ్ మూవీస్ చేసినా ఆ సినిమాలు నేరుగా పబ్లిక్ కి చేరువకాలేవు. ఓటీటీ సబ్స్క్రయిబ్ ఉన్న వాళ్ళకే వస్తుంది. అందువల్ల థియేట్రికల్ మూవీస్ వస్తే ఈ హీరోయిన్ కి బాగా హెల్ప్ అవుతుంది. మరి “న్యూసెన్స్” సినిమాతోనైనా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఆఫర్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News