Pushpa2: జాపనీస్ క్రష్ గా మారిన రష్మీక

నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు జాపనీస్ క్రష్ గా మారింది. ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమాతోనే తెలుగులో మంచి మార్కెట్ ని, యూత్ లో మంచి ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. సౌత్ ఇండియాలోనే ఇంస్టాగ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్స్ తో నంబర్ వన్ స్థానం లో ఉంది.

మొదట్లో తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలకే పరిమితమైన రష్మిక, పుష్ప ఇండియా వైడ్ సెన్సేషన్ అవడంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. దాంతో బాలీవుడ్ లో కూడా రష్మిక మిషన్ మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా కొన్ని కారణాల వాళ్ళ థియేటర్ లో రిలీజ్ అవకుండానే డైరెక్ట్ గా ఓటిటీలో రిలీజై మంచి రివ్యూస్ అందుకుంది.

ప్రస్తుతం రష్మిక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తోన్న యానిమల్ సినిమాలో నటిస్తుంది. మరో పక్క యూరి సినిమా ఫెమ్ విక్కీ కౌశల్ హీరోగా వస్తోన్న చావా అనే మూవీలో కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రష్మిక ఈ మధ్యనే జాపనీస్ పాపులర్ బ్రాండ్ అయిన “ ఒంటిసుక టైగర్ అనే క్లాత్ బ్రాండ్ కి అంబాసిటర్ మారింది. బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా రష్మిక ఆయా బ్రాండ్ క్లాత్స్ ని వేసుకొని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ అవుట్ ఫిట్ తో పాటు రష్మిక ఆమె హెయిర్ స్టయిల్ కూడా జాపనీస్ స్టయిల్ లో ఉండేలా చూసుకుంది. సోషల్ మీడియా జాపనీస్ లుక్ లో రష్మికని చూసిన అందరు నేషనల్ జాపనీస్ క్రష్ అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు