Yashoda: సమంత కొత్త పోకడ చూసి షాక్ అవుతున్న నిర్మాతలు !

రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుని పాత్రలో మలయాళం యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు అన్ని చోట్ల సినిమాని ప్రమోట్ చేసిన మూవీ టీమ్ సినిమా ప్లాప్ అయిన తర్వాత మీడియా ముందుకి ఎవరు రాలేదు. సమంత మాత్రం ఆమె ప్రస్తుతం చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కి సంబంధించిన వర్క్స్ లో బిజీ అయిపోయింది. మరో పక్క విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా తరువాతి షెడ్యూల్ కి కూడా ఆమె ఒకే చెప్పింది.

అయితే శాకుంతలం సినిమా ప్లాప్ సమంతలో పెద్ద మార్పునే తీసుకొచ్చిందట. యశోద, యూ టర్న్, ఓబేబి, సినిమాలలో సమంత ప్రధాన పాత్రలలో నటించి ఆ సినిమా సక్సెస్ లకి కారణం అయింది. అయితే ఇదే విధంగా శాకుంతలం సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆమె ఆశించింది. కానీ అది జరగలేదు. దాంతో ఆమె విమెన్ ఓరియెంటెడ్ కథలకి సమంత బ్రేక్ ఇచ్చిందట. శాకుంతలం సినిమాకి ముందు ఆమె కొన్ని విమెన్ ఓరియెంటెడ్ కథలు విని ,ఎస్ చెప్పిన సమంత. ఇప్పుడు వాళ్లందరికీ సారీ చెప్పి, విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు ఇకపై చేయను అని చెప్పేసిందట, అయితే గతేడాది సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ వస్తుందని గతంలో ఒక ఇంటర్వ్యూ లో యశోద సినిమా డైరెక్టర్స్ఇద్దరు చెప్పారు. ఈ మధ్యనే కథ రెడీ చేసి సమంతకి వినిపించరట సమంత మొహమాటం లేకుండ నో అని చెప్పిందట. దాంతో ఇక చేసేదేం లేక వాళ్ళు యశోద సీక్వెల్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నరంట. అయితే సమంత దగ్గర నుండి ఇలాంటి సమాధానం ఆశించని యశోద సినిమా నిర్మాతలు షాక్ అయ్యారంట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు