బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా, బడా ప్రొడ్యూసర్ బోణి కపూర్ గారాలపట్టిగా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. 2018లో హిందీలో “ధఢక్” సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా యావరేజ్ గానే ఆడినా వారసత్వం వల్ల మూవీ ఆఫర్లు క్యూ కట్టాయి. 2019 లో జాన్వీ మెయిన్ లీడ్ గా చేసిన “గుంజన్ సక్సేనా” మూవీతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా రూహి, మిలి లాంటి సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు.
ఇప్పుడు జాన్వీ కపూర్ కి అదృష్టం వరించి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా ఘనంగా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొనగా, రెండో షెడ్యూల్ నుంచి జాన్వీ కపూర్ సెట్స్ లో అడుగుపెట్టింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు లాంచ్ చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్30 మూవీ లోనే కాకుండా హిందీలో బావాల్, MR & MRS మహి మూవీస్ చేస్తుంది. అయితే తన వారసత్వంతో బాలీవుడ్ లో బాగానే ఛాన్సులు వస్తున్నా, టాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే కొంచెం లక్, టాలెంట్ కూడా ఉండాలి. తెలుగులో పెద్ద హీరోల సినిమాల్లో ఏ హీరోయిన్ నటించినా ఆ సినిమా హిట్టయినా, ప్లాపైనా వెంటనే మరో ఆఫర్ వస్తుంది. అలాగే జాన్వీ కపూర్ కి కూడా రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాల్లో ఆఫర్ వచ్చిందంటూ టాక్ నడుస్తుంది. మరి ఇది నిజమైతే ఈ అమ్మడు తెలుగులో కంటిన్యూగా మూవీస్ చేస్తుందా, లేదా బాలీవుడ్ మీద మోజుతో తెలుగు ఆఫర్లని చేజార్చుకుంటుందా చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News