Vishwambhara Movie Update : చూడడానికి రెండు కళ్లు చాలని సీక్వెన్స్ పూర్తి… సినిమాలో ఇదే హైలెట్

Vishwambhara Movie Update : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. తాజాగా థియేటర్లలో ప్రేక్షకులు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్పించే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేశారు మేకర్స్.

ఇదే అసలు కథ..

విశ్వంభర మూవీలో తాజాగా పూర్తయిన యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఏకంగా మెగాస్టార్ 26 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారు. ఒకే యాక్షన్ బ్లాక్ కోసం చిరు ఇన్ని రోజులు కేటాయించడం అనేది ఆయన కెరీర్ లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 56 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ విగ్రహం ముందే తాజాగా పూర్తి చేసిన ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ కు ముఖ్యంగా మాస్ కు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించబోతున్న ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందించారు. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇండస్ట్రీలో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తుందని, సినిమాలో ఇదే మెయిన్ హైలెట్ కాబోతోందని, ఇక హనుమంతుడు విగ్రహం సెంటిమెంట్ అని టాక్ నడుస్తోంది.

పవన్, చిరు కలిసింది ఇక్కడే…

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేన పార్టీ కోసం చిరు పవన్ కు 5 కోట్ల విరాళం ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అదంతా ఈ మూవీ సెట్స్ లో వేసిన ఈ హనుమంతుడు విగ్రహం ముందే జరిగింది. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ పోషించబోతున్నాడని రూమర్ కూడా వైరల్ అవుతుంది.

- Advertisement -

18 ఏళ్ల తరువాత…

విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా త్రిష కనిపించబోతున్నారు. 18 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి జంట వెండితెరపై కనిపించబోతోంది. గతంలో మెగాస్టార్, త్రిష కలిసి స్టాలిన్ అనే మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇన్నేళ్లకు మరోసారి ఈ మూవీలోనే హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే మ్యూజిక్ సిటింగ్స్ పూర్తి కాగా, ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చాల రోజుల క్రితం రిలీజ్ చేసిన విశ్వంభర మూవీ కాన్సెప్ట్ వీడియోకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. తాజాగా బయటకొచ్చిన ఈ యాక్షన్ సీక్వెన్స్ వార్త సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు