Ooru Peru Bhairavakona: బర్త్ డే రోజు టీజర్ గిఫ్ట్ ఇచ్చిన మూవీ టీమ్

సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాలో సైడ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చి, 2012లో “రొటీన్ లవ్ స్టోరీ” సినిమాతో హీరోగా మారాడు. మొదట్లో అన్ని సెకండ్ హీరో పాత్రలే వచ్చినా, చేసిన పాత్రలన్నీ మంచి పేరు తీసుకురావడం తో హీరో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. 2013లో వచ్చిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమా తో హీరోగా నిలబడ్డాడు. చిన్న సినిమా గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా రారా కృష్ణయ్య, జోరు, బీరువా, టైగర్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

నక్షత్రం, నెక్స్ట్ ఏంటి, ఏ1 ఎక్స్ ప్రెస్, ఇలా అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. లేటెస్ట్ గా ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్విభాషా చిత్రం గా విడుదలైన మైఖేల్ చిత్రం కూడా ఆడలేదు. అయితే సందీప్ కిషన్ కి ప్లాప్ లు ఎదురైనా ఎప్పుడూ కుంగిపోలేదు. వచ్చిన పాత్ర చేసాడు. నటన పరంగా ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. అందుకే ఇప్పటికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇండస్ట్రీ లో అందరితోనూ స్నేహంగా ఉండడం తో సందీప్ కి మంచి పేరు ఉంది. అయితే ఈ రోజు అనగా మే 07న సందీప్ కిషన్ బర్త్ డే. ఈ సందర్బంగా filmify టీమ్ తరపున సందీప్ కిషన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సందీప్ కిషన్ బర్త్ డే సందర్బంగా తాను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీజర్ విడుదల అయింది. ఆ మూవీయే “ఊరు పేరు భైరవకోన”. “డిస్కో రాజా” ఫేమ్ VI ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. మే 07 మధ్యాహ్నం12 గంటలకి చిత్ర టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో సందీప్ కిషన్ చాలా రఫ్ లుక్ లో గడ్డంతో ఉన్నాడు. ఇక టీజర్ మొత్తం గమనించాక తెలిసిందేంటంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక సినిమాలో కథని శ్రీ కృష్ణదేవరాయల కాలానికి లింక్ చేసినట్టు ఆ డైలాగుల ద్వారా చెప్పారు. బాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించగా, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. భైరవ కోన అనే విలేజ్ నేపథ్యంలో సాగుతున్న మిస్టరీ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే టీజర్ చూస్తున్నంత సేపు విరూపాక్ష సినిమాయే గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ సినిమా కావడం విశేషం.

- Advertisement -

ఇక “ఊరు పేరు భైరవకోన” సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వర్ష బొల్లమా, కావ్య థప్పర్ హీరోయిన్లు గా నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 ద్వితీయార్ధం చివర్లో చిత్రం విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ మంచి కమ్ బ్యాక్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు