Heeramandi on OTT : హీరామండిలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Heeramandi on OTT : దిగ్గజ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తొలి వెబ్ సిరీస్ ‘హిరమండి: ది డైమండ్ బజార్’ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఈ సిరీస్‌లో 6 మంది వేశ్యల కథను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్ బన్సాలి. 6 మంది అందమైన బాలీవుడ్ హీరోయిన్లతో పాటు చాలా మంది ప్రముఖ నటులు కూడా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాల, అదితి రావు హైదరీ, ఫర్దీన్ ఖాన్, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెహగల్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించారు. మరి 200 కోట్ల భారీ బడ్జెట్ తో సంజయ్ లీలా బన్సాలీ డ్రీం ప్రాజెక్టుగా వచ్చిన ‘హిరామండి: ది డైమండ్ బజార్’ కోసం ఒక్కో స్టార్ ఎంత పారితోషికం వసూలు చేశారు? ఏ హీరోయిన్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనీషా కొయిరాలా

సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా ‘హిరామండి’లో మల్లికాజన్ పాత్రను పోషిచింది. ఆమె ఇందులో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం మనీషా 1 కోటి రూపాయలు పారితోషికంగా అందుకుంది.

అదితి రావు హైదరీ

మరో హీరోయిన్ అదితి రావ్ హైదరీ ఈ సిరీస్ లో హీరోయిన్ గా కన్పించింది. ఇదే ఆమె మొదటి వెబ్ సిరీస్‌ కాగా, హీరామండి ‘బిబ్బోజన్’ అనే ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె 1 నుండి 1.5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

ఫర్దీన్ ఖాన్

ఫర్దీన్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత ‘హిరామండి: ది డైమండ్ బజార్’తో సినీ ప్రపంచంలోకి రీఎంట్రీ ఇచ్చారు. హీరామండిలో ఆయన ‘వలీ మహ్మద్’ క్యారెక్టర్‌లో నటించాడు. ఇందుకోసం దాదాపు 7 లక్షలు పారితోషికంగా తీసుకున్నారు.

సంజీదా షేక్

‘హిరామండి: ది డైమండ్ బజార్’లో ‘వహీదా’ పాత్రను పోషిచింది సంజీదా షేక్. ఈ పాత్ర కోసం అతను 40 లక్షల రూపాయలు వసూలు చేసింది.

రిచా చద్దా

‘హిరామండి: ది డైమండ్ బజార్’లో ‘లాజో’ పాత్రలో రిచా చద్దా నటించింది. తన అద్భుతమైన నటనతో పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రిచా ఈ పాత్ర కోసం 1 కోటి రూపాయల పారితోషికం అందుకుంది.

షర్మిన్ సెహగల్

సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు షర్మిన్ సెహగల్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె పాత్ర పేరు ‘అలంజేబ్’. వెబ్ సిరీస్‌లో ఉన్న అందాల సుందరిలందరిలో షర్మిన్ సెగల్ తక్కువ పారితోషికాన్ని అందుకుంది. ఆమె కేవలం రూ.35 లక్షలు మాత్రమే తీసుకుంది.

సోనాక్షిసిన్హా

ఈ వెబ్ సిరీస్‌లో ‘ఫరీదాన్’ అనే పాత్రను పోషించింది మరో హీరోయిన్ సోనాక్షి. ఈ సిరీస్‌లో అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్ సోనాక్షినే. ‘హిరామండి: ది డైమండ్ బజార్’ కోసం సోనాక్షి సిన్హా 2 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ వరకు ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు