Bellamkonda Sai Srinivas Pan India Movie : భారీ బడ్జెట్, పాన్ ఇండియా హీరోయిన్… బెల్లంకొండకు ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే

Bellamkonda Sai Srinivas Pan India Movie : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ ను అందుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను అనే సినిమాను చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి బాబీ కథను అందించాడు. ఆ సినిమాతో తర్వాత స్పీడున్నోడు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయకి సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన సాక్ష్యం, కవచం సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. అయితే దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన సీత సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇకపోతే తమిళంలో సూపర్ హిట్ సినిమా అయినా రాట్ససన్ తెలుగు రీమేక్ గా వచ్చిన రాక్షసుడు అనే సినిమాలో నటించాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుందని చెప్పొచ్చు.

వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో సరిగ్గా సాయి శ్రీనివాస్ కి బ్రేక్ ఇచ్చే సినిమా అంటూ ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్లో ఛత్రపతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందని చెప్పొచ్చు.

- Advertisement -

ప్రస్తుతం సాగర కే చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా భీమ్లా నాయక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సాగర కే చంద్ర. సాగర్ కే చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేయబోయే సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుగు ఫిలింనగర్ లో చక్కెర్లు కొడుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దాదాపు 50 కోట్లు భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మూవీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మూన్ షైన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఫిమేల్ లీడ్ గా సంయుక్త మీనన్ ఫైనల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాకు నడుస్తుంది. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఏదేమైనా ఈ సినిమాతో అయినా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఒక బ్రేక్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. సినిమాలు సక్సెస్ కాకపోయినా కూడా సినిమాలు అయితే చేస్తూ సీరియస్ గా అటెంప్ట్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. రీసెంట్ గా సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు