Rashmika Mandanna : విజయ్ రష్మిక వెకేషన్.. ఆ రిసార్ట్ లో ఒక్కరోజు రెంట్ ఎంతో తెలుసా?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోంది అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి వెళ్లిన వెకేషన్ లో ఓ రీసార్ట్ కు రష్మిక భారీగా ఖర్చు చేసిందనే వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ రిసార్ట్ లో స్టే చేసినందుకు వీళ్ళకు ఎంత ఖర్చయింది? అన్న ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

రీసెంట్ గా రష్మిక మందన్న తన 28వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. తన బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం దుబాయ్ కి వెళ్ళింది. అలాగే మరోవైపు విజయ్ దేవరకొండ ఆ టైమ్ లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే ఆయన కూడా దుబాయ్ కే వెళ్లినట్టుగా రూమర్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి అక్కడ టైం స్పెండ్ చేశారు అనే పుకార్లు షికార్లు చేశాయి. ఇక రష్మిక మందన్న సైతం సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్న విషయాన్ని అభిమానుల ముందు పెట్టింది. అయితే ఆ పోస్టుల కింద రష్మిక తను స్టే చేసిన రిసార్ట్ అనంతరా హోటల్స్ ను కూడా ట్యాగ్ చేసింది.

దీంతో ఈ హోటల్లో స్టే చేయాలంటే ఎంత ఖర్చవుతుంది అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు ఆమె అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం అనంతరా హోటల్స్ అనేది ఒక విలాసవంతమైన కాస్ట్లీ రిసార్ట్. అందులో ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఖర్చు 27,000 నుంచి 67,000 వరకు అవుతుంది. జిఎస్టి లాంటి అన్ని ఖర్చులు కలిపి చూసుకుంటే ఒక్క రాత్రికి లక్ష కూడా అయ్యే అవకాశం ఉంది. అనంతరా హోటల్ లో ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా హ్యాపీగా గడిపేయొచ్చు. అందులో అరేబియా వైల్డ్ లైఫ్ పార్క్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడే స్టే చేసే జంటలు ఒకేచోట ఉండి అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతితో మమేకమవుతూ పార్ట్నర్ తో రొమాంటిక్ గా లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి ఒక్క నైట్ కే ఈ రేంజ్ లో రెంట్ పే చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక రష్మిక విజయ్ నిజంగానే అక్కడ కలిసి స్టే చేశారా అంటే ఆ విషయంపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియా ఫోటోలను రుజువులుగా చూపించి వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుందే తప్ప వాళ్ళిద్దరూ నోరు విప్పి మేము ప్రేమలో ఉన్నాం అని చెప్పింది లేదు.

- Advertisement -

ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 మూవీలో నటిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలోకి రాబోతోంది. మరోవైపు విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు