T20 World Cup.. మహాసంగ్రామం కోసం మీరంతా సిద్ధం కండి అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్.. ఇంకొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీం ఇండియాకి ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా కల్కి 2898AD లోని అశ్వద్ధామ అవతారంలో వచ్చి.. క్రికెటర్స్ లో స్ఫూర్తి నింపారు అమితాబ్ బచ్చన్.. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకోగా ఇది చాలా వైరల్ గా మారుతోంది. టి20 ప్రపంచ కప్ 2024 కోసం శంఖారావం మోగింది అంటూ చిత్ర బృందం ఈ వీడియో కింద వ్యాఖ్యానించింది..
వైరల్ గా మారిన వీడియో..
ఒక వీడియో విషయానికి వస్తే.. ఇందులో అశ్వద్ధామ క్యారెక్టర్ లో అమితాబ్ క్రికెటర్లలో ప్రేరణ నింపేలా కావ్యాన్ని చెబుతుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో కల్కి 2898 ఏడి సినిమా మ్యూజిక్ వినిపించింది.. ఇది మహా యుద్ధం.. గొప్ప పోరాటం.. విజయం ముందు మీరు తలవంచోద్దు.. ధైర్యంగా ఉండండి.. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి.. బలాన్ని చూపండి.. ప్రతి తల్లి గర్వపడేలా చేయండి.. శత్రువు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి.. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధం అవుతారు.. అంటూ క్రికెటర్లకు పిలుపునిచ్చారు అమితాబ్ బచ్చన్.. మరొకవైపు అమితాబ్ మాటలు వినిపిస్తూ ఉండగా తెరపై రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా , విరాట్ కోహ్లీ తదితర క్రికెటర్లను చూపించడం జరిగింది. వీరితోపాటు గతంలో దేశానికి ప్రపంచ కప్ అందించిన మహేంద్రసింగ్ ధోని అలాగే నాటి సంబరాలను కూడా ప్రదర్శించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ఆటలు అంటే అమితాబ్ కు ఎనలేని ఇష్టం..
వాస్తవానికి అమితాబ్ బచ్చన్ కి పాటలు అంటే చాలా ఆసక్తి.. ఆయనకు కాస్త సమయం దొరికితే చాలు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడడానికి వెళుతూ ఉంటారు.. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 AD సినిమాలోని తన అశ్వద్ధామ ఫస్ట్ లుక్ ను ఐపీఎల్ సీజన్ లోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా అదే గెటప్ లో వచ్చి స్టార్ క్రికెటర్స్ ను ప్రపంచ కప్ కోసం సిద్ధం కమ్మంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.
కల్కి 2898AD చిత్ర విశేషాలు..
గత ఏడాది సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు కల్కి చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. దీపికా పదుకొనే హీరోయిన్ గా , ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఇకపోతే ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది దీపికా పదుకొనే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram