కొన్నిసార్లు అనుకున్న కాంబినేషన్లో సినిమాలు వర్కౌట్ కావు. ఒక సినిమా చేద్దామని ఎన్నో డిస్కషన్స్ పెట్టుకొని, కథలు డిస్కస్ చేసుకొని, అన్ని రెడీ అయిన తర్వాత సెట్స్ మీదకు కూడా వెళ్లి, కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత సడన్ గా డైరెక్టర్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కోకొల్లలుగా ఉన్నాయి. ముందు ఒక డైరెక్టర్ తో అనుకొని మరో డైరెక్టర్ తో ఆ సినిమాను పూర్తి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పటికప్పుడు డైరెక్టర్ ను మార్చడానికి చాలా కారణాలు ఉంటాయి. అనుకున్న కథని అనుకున్న విధంగా తీయలేకపోవటం. ప్రొడ్యూసర్ తో ఇష్యూస్ రావడం ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి.
ఇప్పుడు తెలుగు సినిమాలలో అలా చేయవలసిన డైరెక్టర్లు మారిన సినిమాలు లిస్ట్ తీస్తే చాలానే ఉంటుంది. మొదటగా రిక్షావోడు అనే సినిమాను స్టార్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్.
ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఊపుతో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాను రాసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహించాడు. దీనికంటే ముందు ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించాలి కానీ ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తుండటం వలన సంపత్ నందిని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు అని వదిలేసి ఈ అవకాశాన్ని బాబి కల్పించాడు పవన్ కళ్యాణ్.
నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను ముందుగా దర్శకుడు తేజ తెరకెక్కించాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. దీనికి కారణం తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయోపిక్ జెన్యూన్ గా రావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి కృష్ణ జాగర్లమూడి యాడ్ అయ్యాడు.
విశాల్ హీరోగా చేసిన డిటెక్టివ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా డిటెక్టివ్ 2 కూడా వస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాను కూడా మిస్కిన్ దర్శకత్వం చేయాల్సి ఉంది. కానీ కొన్ని విభేదాలు వలన విశాల్ దర్శకత్వం వహించాడు
కంగనా రనౌత్ దర్శకత్వంలో వచ్చిన మణికర్ణిక సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలియంది కాదు. అయితే ఆ సినిమాను మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాల్సి ఉంది.
ఆ సినిమాకు సంబంధించి చాలా పోర్షన్స్ కూడా క్రిష్ జాగర్లమూడి చేశాడంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా డైరెక్షన్ మాత్రం కంగనా రనౌత్ పేరు ఉంటుంది.
విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆట సినిమాకు మొదట హరీష్ శంకర్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కథ అది కాదు. కానీ ఆ కాంబినేషన్లో హరీష్ శంకర్ కు ఆల్మోస్ట్ ఒక సినిమా సెట్ అయింది. కానీ ప్రొడ్యూసర్స్ తో కొన్ని డిఫరెన్సెస్ వలన ఆ సినిమాను హరీష్ వదిలేసాడు. ఆ టైంలో విఎన్ ఆదిత్య ఆట సినిమాను తెరకెక్కించారు.
ఇక తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు టీజర్ తో కూడా ఈ సినిమాకి మరో డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతునట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ చేసిన టీజర్ లో కూడా దర్శకులు పేర్లు ఇద్దరు పేర్లు ఉండటం గమనార్హం. ఏదేమైనా అంతగా సక్సెస్ రేట్ లేని జ్యోతి కృష్ణ ఈ సినిమా చేస్తున్నాడు అంటే చాలామంది పవన్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కానీ క్రిష్ పర్యవేక్షణలో కాబట్టి పరవాలేదని కొంతమంది అనుకుంటున్నారు.