Aayirathil Oruvan2 : పర్ఫెక్ట్ మల్టీస్టారర్

ఆయిరత్తిల్ ఒరువన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు యుగానికి ఒక్కడు అని అంటే తెలియని వారు ఉండరు. అంత పెద్ద హిట్ అయింది ఈ సినిమా. కార్తీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కార్తీ ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు. అప్పటి వరకు లవ్ సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమాతో పీక్ లెవెల్ ఫిలిం మేకర్ అనిపించాడు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2010 జనవరి 14న విడుదలైంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే 1279 వ సంవత్సరంలో జరిగిన సంఘటనలతో సినిమా స్టార్ట్ అవుతుంది. చోళ రాజ్యాన్ని దండయాత్ర బారి నుండి కాపాడటం కోసం చోళ రాజు తమ ప్రజలను ఓ సురక్షిత ప్రాంతానికి పంపిస్తారు. అలా రోజులు గడిచిపోతాయి… ప్రస్తుత కాలంలో ఒక అర్కియాలజిస్ట్ తన తండ్రిని వెతకడం కోసం ఓ కూలి, (కార్తీక్) ఓ ఆర్మీ ఆఫీసర్ తదితరుల సహాయంతో బయలుదేరుతారు. దారి మధ్యలో 7 ప్రమాదాలను దాటుకుని చివరికి వారు శతాబ్దల క్రితం ఏర్పడిన చోళ రాజ్యన్నీ చేరుకొంటారు. వారు అక్కడకి చేరుకొన్న తర్వాత జరిగిన పరిణామాలేంటి అన్నదే మిగత కధ.

అయితే ఈ సినిమా అప్పట్లో తమిళ్లో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయింది. అప్పట్లో ఈ సినిమా గురించి చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 30 కోట్లు పైగా డబ్బులు పెట్టి నిర్మించారని చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న సెల్వ రాఘవన్ ఈ సినిమాకి కేవలం 18 కోట్లు మాత్రమే ఖర్చయిందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ లో రెడీ చేయబోతున్నాడు సెల్వరాఘవన్. ఈ సినిమాలో కార్తీతో పాటు ధనుష్ నటించిన బోతున్నట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి. అయితే వీరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ రావడం అనేది అందరికీ అంచనాలను ఒక రేంజ్ లో పెంచుతుంది అని చెప్పొచ్చు. దీనికి తోడు ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా రాబోతుండడంపై అందరూ ఈ సినిమా గురించి క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా సీక్వెలను జనవరిలోనే అనౌన్స్ చేశాడు సెల్వరాఘవన్. అయితే ఈ పోస్ట్ పై కూడా ధనుష్ స్పందించాడు. ఈ సినిమాపై ధనుష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘అద్భుతమైన సినిమా. ప్రీ ప్రొడక్షన్‌కే ఏడాది సమయం పడుతుంది. మాస్టర్ సెల్వరాఘవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఆయిరతిళ్ ఒరువన్ 2.. 2024లో రాజకుమారుడు వస్తాడు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాలో తన లుక్‌తో కూడిన పోస్టర్‌ను ధనుష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇకపోతే ధనుష్ మాత్రమే కనిపిస్తాడు అనుకున్న ఈ సినిమాలో కార్తీ కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు