Sai dharam tej : సంయుక్త విరూపాక్ష డైరెక్టర్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటోతెలుసా ?

సాయి ధరమ్ తేజ్ ,సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ఆక్సిడెంట్ తరువాత రిలీజ్ అయిన మొదటి సినిమా అవడంతో వరుస ప్లాప్ లలో ఉన్న సాయికి ఈ సినిమా అయిన మంచి హిట్ అవ్వాలి అని అందరు కోరుకున్నారు. అదే నిజమై అందరూ ఆశించినట్టే విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. కేవలం 5 రోజుల థియేటర్ రన్ లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా థియేటర్స్ లో సందడి చేస్తుంది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అయితే విరూపాక్ష సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో అంతే సమానంగా సంయుక్త మీనన్ కూడా కష్టపడింది. విరూపాక్ష సినిమాలో సంయుక్త హీరోయిన్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ దగ్గర నుండి సాయి ధరమ్ తేజ్ ,సంయుక్త మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండు థియేటర్స్ ని విజిట్ చేస్తూ ప్రేక్షకులలో జోష్ నింపుతున్నారు. అయితే ఈ మధ్యనే ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ దండు,సాయి ధరమ్ తేజ్ , సంయుక్త ఒక థియేటర్ దగ్గరికి వెళ్లారు. ప్రేక్షలకులతో ఇంట్రాక్షన్ తర్వాత వచ్చి చూసుకుంటే డైరెక్టర్ కార్తీక్ దండు ఫోన్ పోయిందంట.ఎంత వెతికిన ఫోన్ కనిపించకపోయేసరికి  కాసేపు వెతికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.

ఉదయాన్నే లేచి చూస్తే కార్తీక్ దండు ఫోన్ ఇంటి దగ్గరికి వచ్చి ఉంది. కాకపోతే అది పోగొట్టుకున్న ఫోన్ కాదు కొత్త ఐఫోన్. విషయం ఏంటంటే హీరోయిన్ సంయుక్త విరూపాక్ష రిలీజ్ తరువాత డైరెక్టర్ కార్తీక్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుందట అనుకోకుండా థియేటర్ దగ్గర కార్తీక్ ఫోన్ పోవడంతో సంయుక్త వెంటనే ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట. అందుకే డైరెక్టర్ కార్తీక్ కి సంయుక్త ఐఫోన్ ని గిఫ్ట్ చేసింది. సాధారణంగా ఇలాంటివి ప్రొడ్యూసర్స్ హీరోలకి ,లేదా హీరోయిన్స్ కి ,డైరెక్టర్స్ కి గిఫ్ట్ లు ఇస్తుంటే సంయుక్త మాత్రం తనని క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు