Kollywood: క్రేజీ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా..!

భారతీయ సినీ చరిత్రలో విలక్షణ నటనకు మారుపేరు ఏంటంటే, కమల్ హాసన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన విలక్షణ నటనతో ఎన్నో సినిమాల ద్వారా అలరించిన కమల్, ఏడు పదుల వయసులో కూడా యువ హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన విక్రమ్ సినిమా ద్వారా తనలోని నటుణ్ని మరోసారి పరిచయం చేశారు. ప్రస్తుతం విక్రమ్ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న కమల్ ఈ గ్యాప్ లో సీనియర్ డైరెక్టర్ మణిరత్నంతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతుంది.

ప్రస్తుతం మణిరత్నం పీఎస్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీఎస్ 1 తమిళ్ మినహా మిగతా భాషల్లో ఆశించినంత విజయం అందుకోలేక పోవటంతో పీఎస్ 2 పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు మణిరత్నం. పీఎస్ 2 సినిమా రిలీజ్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని మణిరత్నం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం అందుతుంది. ఈ క్రమంలో అప్పట్లో నాయకుడు సినిమా ద్వారా సంచలనం సృష్టించిన ఈ కాంబినేషన్ నుండి మళ్ళీ సినిమా వస్తోంది అన్న వార్తల నేపథ్యంలో హైప్ క్రియేట్ అవుతోంది.

ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేక సతమతం అవుతున్న మణిరత్నం కమల్ హాసన్ తో చేసే సినిమా ద్వారా అయినా తన సత్తా చాటుతాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో జోష్ మీదున్న కమల్ హాసన్ అదే ఊపులో మరో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమా ఏ జానర్లో ఉండనుంది వంటి అంశాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు