Rathnam: విశాల్ రత్నం మూవీ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి పండగే..!

Rathnam: కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెంకోడి, పొగరు వంటి చిత్రాలతో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే ఇక మాస్ ఆడియన్స్ కి పండగే. విశాల్ నటిస్తున్న తాజా చిత్రం రత్నం.

ఈ సినిమాకి సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తూండగా.. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో – ప్రొడ్యూసర్. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి.

సోమవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. రత్నం ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. దేవిశ్రీ అందించిన బీజీఎం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుండగా.. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సందేశాత్మక కథాంశంతో రూపొందిస్తున్నామని దర్శకుడు హరి తెలిపారు. ఈ మూవీని ఏప్రిల్ 26న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు