Nithin32: శర్వానంద్ రిసెప్షన్ కి రాకపోవడానికి కారణం

టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షిత రెడ్డిల పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో జూన్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. శర్వానంద్ తన పెళ్ళి రాజస్థాన్ లో జైపూర్ లో కేవలం బంధు మిత్రుల సమక్షంలో జరుపుకోవడం వల్ల రిసెప్షన్ ని ఇక్కడ గ్రాండ్ గా జరుపుకున్నాడు. ఈ రిసెప్షన్ వేడుకకి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ నటులతో పాటు, రానా, అల్లరి నరేష్, నిఖిల్, విశ్వక్ సేన్ తదితరులు ఈ వేడుకకి హాజరయ్యి విష్ చేసారు.

అయితే శర్వానంద్ కి ఎంతో సన్నిహితంగా ఉండే రష్మిక మందన్న మాత్రం ఈ వేడుకకి రాలేదు. దానికి బదులిస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో శర్వానంద్ రక్షితలకు విష్ చేస్తూ రాకపోవడానికి కారణం చెప్పింది. ఈ రిసెప్షన్ కు ఖచ్చితంగా రావాలని అనుకున్నాను. కానీ మా డైరెక్టర్ వెంకీ కుడుముల షూట్ ఉండడం వల్ల నన్ను అనుమతించలేదు. కానీ నా ప్రేమతో పంపిన విషెస్ ఎప్పుడు మీతో ఉంటాయి, అని రాసి స్టేటస్ పెట్టింది.

అయితే రష్మిక మందన్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల రిసెప్షన్ కి వెళ్ళలేదు. ఇక శర్వానంద్ రష్మిక కాంబోలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా వచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు