Gunturu karam: పూజా హెగ్డే ని అనుగ్రహించిన ఆ యంగ్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదనే చెప్పాలి. ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో బిజీ బిజీ ఉండే ఈ ముంబై బ్యూటీ ప్రస్తుతం ఖాళీ అయిపొయింది.

ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతుండటంతో, ఎవ్వరు ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకోడానికి ముందుకి రావట్లేదు. దాంతో ఈ హీరోయిన్ కెరీర్ చిక్కుల్లో పడిపోయినట్టైంది. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న, ఈ భామ చేతిలో మహేష్ సినిమా తప్ప వేరే సినిమా ఏది లేదు.

కెరీర్ బిగినింగ్ లోనే దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన పూజా హెగ్డే. అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. పెద్ద హీరోల పుణ్యమా అని కొద్దిరోజుల పాటు కెరీర్ బాగానే , ఇప్పుడు మాత్రం తిప్పలు తప్పట్లేదు.

- Advertisement -

టాలీవుడ్ సంగతి సరేసరి బాలీవుడ్ లోనైన తన లక్ ని పరీక్షించుకుందామని ఆమె చేసిన కిసీ కా భాయ్ కిసీకి జాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బడా డిజాస్టర్ గా నిలిచింది. అంతకు ముందు చేసిన సర్కస్ సినిమా కూడా ఇదే విధమైన ఫలితాన్ని ఇవ్వడంతో, బాలీవుడ్ కూడా ఈ హీరోయిన్ ని దూరం పెట్టింది.

అయితే ఈ విధంగా చిక్కుల్లో ఉన్న పూజా హెగ్డే ని ఒక టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం ఏరికోరి మరీ తన సినిమాలో పెట్టుకోడానికి రెడీ అయ్యాడు. అతనెవరో కాదు హీరో విజయ్ దేవరకొండ. గీత ఆర్ట్స్ బ్యానర్ పై పరుశరాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.తొందరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ పక్కన హీరోయిన్ గా చేయడానికి పూజా హెగ్డే ని తీసుకోనున్నారని సమాచారం. అందులోనూ ఈ హీరోయిన్ పేరుని స్వయంగా విజయ్ దేవరకొండనే సజెస్ట్ చేసాడంట.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది సెట్స్ పైకి వెళ్ళలేదు. దాంతో విజయ్ పూజా హెగ్డే పేరుని సజెస్ట్ చేసాడని టాక్. మరీ ఈ సినిమాతోనైనా పూజా కెరీర్ గాడిలో పడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు