RajaSaab: ముగ్గురు భామలతో ప్రభాస్.. సినిమాకి అదే హైలెట్..!

RajaSaab.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజా సాబ్ , స్పిరిట్, సలార్ 2 సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఎక్స్ (ట్విట్టర్) లో వైరల్ గా మారింది. మరి ఆ అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ముగ్గురు భార్యలతో ప్రభాస్..

ప్రభాస్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ మారుతి రచన, దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న చిత్రం రాజా సాబ్.. ఈ ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఒక పాటలో మాస్ డ్యాన్స్ చేయబోతున్నారట. ఈ పాటలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ మరియు రిద్ధికుమార్ ఈ ముగ్గురు అందాల భామలతో ప్రభాస్ డ్యాన్స్ చేయబోతున్నారట. ఈ డ్యాన్స్ సినిమాకే హైలైట్ గా నిలవబోతోంది అని సమాచారం. అంతేకాదు మారుతి అలాగే ఆయన బృందం ఈ పాట కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడమే కాదు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాటలో ప్రభాస్ పూర్తి స్థాయిలో డాన్స్ చేస్తూ కనిపిస్తారట. మొత్తానికి అయితే ప్రభాస్ అభిమానులకు ఈ వార్త కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.. మరి థియేటర్లలో ముగ్గురు భామలతో ప్రభాస్ ఏ విధంగా పర్ఫామెన్స్ ఇస్తారో చూడాలి. మొత్తానికైతే ప్రభాస్ రాజాసాబ్ మూవీ నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

ప్రభాస్ చిత్రాలు..

రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవేంద్ర ఈశ్వర్ సినిమాలతో కెరియర్ మొదలు పెట్టిన ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. లవ్ రొమాంటిక్ చిత్రాలే కాదు మాస్ ,యాక్షన్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. ఇలా ప్రతి సినిమాతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు.. ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా చిత్రాలనే ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇకపోతే పాన్ ఇండియా చిత్రాలలో భాగంగా సాహో,ఆది పురుష్ చిత్రాలను తెరకెక్కించినా ఈ సినిమాలు విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలను వరుసగా ప్రకటిస్తున్నారు కానీ ఈ సినిమాలు ఈయనకు ఏ విధంగా విజయాన్ని అందిస్తాడో చూడాలి. మొత్తానికి అయితే గత ఏడాది సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కి 2898AD అనే చిత్రంతో వస్తున్నారు ఈ సినిమా అయిన వెంటనే రాజాసాబ్ రిలీజ్ కి సిద్ధం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు