Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ తండ్రితో డైరెక్టర్ పూరీ గొడవ..కారణం..?

Rakul Preet Singh.. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ భారీగా క్రేజ్ అందుకొని.. టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ అంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈమె స్టార్ డైరెక్టర్లకి కూడా నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు ఆఫర్ల కోసం డైరెక్టర్ ల వెంటపడుతోందిఅనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి.. ఇకపోతే ఈ విషయం కాస్త పక్కన పెడితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడం గమనార్హం..

Rakul Preet Singh: Director Puri jagannath fight with RakulPreetSingh Father..why?
Rakul Preet Singh: Director Puri jagannath fight with RakulPreetSingh Father..why?

రకుల్ తండ్రితో పూరీ గొడవ..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా ద్వారా హన్సిక మోత్వాని తెలుగు ప్రజలకు పరిచయమై.. తన అందంతో, నటనతో మెస్మరైజ్ చేసింది.. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నారట.. అందుకు తగ్గట్టుగానే రకుల్ తండ్రితో పూరీ జగన్నాథ్ కూడా మాట్లాడడం జరిగింది.. ఇదే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్.. పోకిరి సినిమా తర్వాత అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాను చేయడానికి సిద్ధమైనప్పుడు.. నన్ను ఒకానొక సందర్భంలో చూశారట ..ఆ సినిమాలో నన్ను హీరోయిన్గా తీసుకుంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని అనుకున్నారు.. ఇక అంతే దేశముదురు సినిమాలో రకుల్ ను తీసుకోవాలని అనుకుంటున్నాం అంటూ నేరుగా మా నాన్నతో వచ్చి మాట్లాడారు. కానీ నాన్న ప్రస్తుతం పరీక్షలు రాస్తుంది.. అంతేకాకుండా తెలుగు కూడా రాదు.. కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుందేమో అని సినిమాను తిరస్కరించారు.. అప్పుడు నాన్నతో పూరీ డైరెక్టుగా మాట్లాడారు.. నాన్నపై సీరియస్ కూడా అయ్యారు. డిగ్రీ పరీక్షలు ఇవాళ కాకుంటే తర్వాత రాసుకోవచ్చు.. కానీ ఇలాంటి ఆఫర్ చేజారితే మళ్ళీ లభించదు.. డిగ్రీ పాసయ్యి ఆ పట్టాను మెడలో వేసుకొని. నీ కూతురు ఏమైనా తిరుగుతుందా? అని పూరీ నాన్న పై మండిపడ్డారు అయినా కూడా నాన్న మాత్రం దేశముదురు సినిమా చేయడానికి ఒప్పుకోలేదు అలా ఆ సినిమాలో అవకాశం కోల్పోయాను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది..

నా కెరియర్ పై పూరీ సార్ శ్రద్ధ చూపించారు..

నా భవిష్యత్తు కోసం పూరీ సార్ మా నాన్నతో గొడవపడ్డారు.. కానీ నాన్న మాత్రం అందుకు అంగీకరించలేదు.. ఇక తర్వాతే నేను మళ్ళీ నా డిగ్రీ పరీక్షలు రాసి పట్టా పొందాను.. ఆ తర్వాత కొంతకాలానికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో అవకాశం రావడంతో ఆ సినిమాతో మంచి పేరు లభించింది అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్న ఈమె అక్కడ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశం కోసం ఎదురుచూస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు