Allu Arjun : పుష్ప 2 లో శ్రీవల్లి చనిపోతుందా ?

అల్లు అర్జు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయి ఆ తరువాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత ఆర్య సినిమాకి సీక్వెల్ గా వీరిద్దరూ కలిసి ఆర్య2 సినిమా చేసారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ కాంబో చాలా యేళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ పుష్ప సినిమాతో కోలాబిరేట్ అయ్యారు. ముందుగా ఒకటే పార్ట్ గా అనుకోని స్టార్ట్ చేసిన ఈ సినిమా అనుకోకుండా రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందని సుకుమార్ చాలా సార్లే చెప్పాడు. అయితే పార్ట్1 సూపర్ సక్సెస్ అవడంతో పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన వేర్ ఇజ్ పుష్ప వీడియోకి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం సుకుమార్ అండ్ అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వైఫ్ శ్రీవల్లి చనిపోతుంది అనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. పుష్ప పార్ట్ 1 లో వీరిద్దరికి పెళ్లి అవ్వగా, పుష్ప 2 లో ఈమె చనిపోతుందని రష్మిక చనిపోయిన స్టిల్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే అది నిజమే అని నమ్మిన అందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తీరా చూస్తే అది ఒక మరాఠి సినిమా పిక్ అని తెలియడంతో, పుష్ప లీక్, పుష్ప లీక్ అంటూ పోస్ట్ లు చేసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు