NTR 100years: శతజయంతి వేడుక కి స్టార్స్ రావట్లేదా?

నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు కొన్ని రోజుల కిందట వైజాగ్ లో టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మే 20 న కెపిహెచ్ బి లోని ఖైతలపూర్ లో నందమూరి ఫ్యామిలీ అట్టహాసంగా జరిపేందుకు గట్టిగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శ్రేయాస్ గ్రూప్ మీడియా వారు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ అంతా కదిలివస్తున్నారంటూ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

టాలీవుడ్ టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు, సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వస్తున్నారని ప్రకటించారు. వీరే గాక యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, నితిన్ ,రానా లు కూడా హాజరవుతున్నారని గట్టిగా ప్రచారం చేసారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్స్ రావడం లేదని తెలిసింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం వల్ల ఆ రోజు పూర్తిగా తన ఫ్యామిలీకి కేటాయించబోతున్నారని అందువల్ల ఈ వేడుకకి హాజరుకావట్లేదని సన్నిహితుల ద్వారా సమాచారం అందింది. ఇక టాలీవుడ్ స్టార్స్ ఏళ్లుగా అర్జున్, ప్రభాస్ లు కూడా తమ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఇక్కడికి రాకపోవచ్చని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు యంగ్ హీరోస్ మాత్రం ఈ ఈవెంట్ కు రావడం జరుగుతుంది. మరి ఎన్టీఆర్ శత జయంతి వేడుకకి అనౌన్స్ చేసి వస్తున్నారని చెప్పిన వాళ్లలో ఎంత మంది స్టార్స్ వస్తారో తెలియాలంటే ఫంక్షన్ అయ్యే వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు