Pooja Hegde :బుట్ట బొమ్మని వరించిన మరో అవార్డ్

సినిమాల హిట్స్ అండ్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పుడు తన బ్యూటీ తో అందరిని కట్టుకునే టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేని లేటెస్ట్ గా ఒక అవార్డ్ వరించింది. అదికూడా ఒక ప్రముఖ ఇండియన్ కాస్మొటిక్ కంపెనీ నుంచి ఈ అవార్డ్ రావడం విశేషం అనే చెప్పాలి.

నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచమైన పూజా హెగ్డే , మొదటి సినిమాతోనే టాలీవుడ్ అటెన్షన్ కి గ్రాబ్ చేసింది. ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తు వచ్చిన ముకుంద సినిమాలో హీరోయిన్ గా చేసే గోల్డెన్ అవకాశాన్ని దక్కించుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూజా హెగ్డే కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం(DJ) సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కొద్దిరోజుల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయింది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాలో నటించింది. అలాగే తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటిస్తుంది. అయితే గత కొద్దీ కాలంగాఆమె చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వస్తుండటంతో ఈ మధ్య ఆమె జోరు కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే మామా ఎర్త్ అనే పాపులర్ ఇండియన్ కాస్మొటిక్ బ్రాండ్ ఇటీవలనే నిర్వహించిన బ్యూటిఫుల్ ఇండియన్ 2023 కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డేకి స్టార్ ఆన్ ది రైస్ అవార్డ్ ని ప్రధానం చేసారు. అలాగే బాలీవుడ్ సెలెబ్రెటీస్ విద్యాబాలన్, విక్కీ కౌశల్, అదితి రావు హైదరి,  వాణి కపూర్, సోను సూద్, రాణి ముఖర్జీ ఇతరేతర అవార్డ్ లు గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్లాప్ లతో ఉన్నకూడా పూజా హెగ్డేకి ఇలాంటి అవార్డు రావడం విశేషమనే చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు