Adi purush: తన పెయింటింగ్ లు చూసి మురిసిపోతున్న హీరోయిన్

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తున్న చిత్రం “ఆది పురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఈ ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఆది పురుష్ ట్రైలర్ మూవీ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేయగా, చిత్ర యూనిట్ కూడా దానికి తగ్గట్లు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు.

ఇక ఆది పురుష్ లో సీత గా నటించిన హీరోయిన్ కృతి సనన్ సోషల్ మీడియా ద్వారా “ఆది పురుష్” మూవీ ని ప్రమోట్ చేస్తూ తన వంతు బాధ్యత వహిస్తుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు ఫ్యాన్స్ పంపే వీడియోలు ఆది పురుష్ థియేటర్ రెస్పాన్స్ వీడియోలు కూడా పెడుతూ ఇన్స్టా గ్రామ్ లో సందడి చేస్తుంది.

ఇక తాజాగా ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకి సంబంధించిన కృతి స్టిల్ ని అభిమానులు పెయింటింగ్ వేసి పంపించారు. ఆ వీడియో ని కృతి సనన్ సంతోషంతో తన ఇన్స్టా పేజీలో స్టేటస్ పెట్టింది. ఇక కృతి సనన్ ఆది పురుష్ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకుంది. హిందీలో బాగానే ఆఫర్లు వస్తున్నా టాప్ హీరోయిన్ గా స్థానం రాలేదు. ఇటు సౌత్ లో కూడా ఈ అమ్మడికి ఫేమ్ లేదు. ఆది పురుష్ సినిమా హిట్ అయితే ఇండియా మొత్తం తన స్టార్ డమ్ తో చక్రం తిప్పాలని చూస్తుంది. మరి అది వీలవుతుందా లేదా తెలియాలంటే జూన్ 16 ఆది పురుష్ విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు