Mythri Movie Makers : డబ్బులు లేక డబ్బింగ్ సినిమాలు

Mythri Movie Makers : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. అమెరికాలో కొన్ని సినిమాలను రిలీజ్ చేయడం దగ్గర మొదలుపెట్టి తెలుగులో శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ సంస్థ. మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలను నిర్మించింది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు హిట్ అయ్యాయని చెప్పొచ్చు. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ మంచి ఫలితాలను తీసుకొని వచ్చాయి. ఈ ప్రొడక్షన్స్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు కూడా ఈ సంస్థ నిర్మించింది.

శ్రీమంతుడు సినిమాతో మొదలైన వీరి ప్రయాణం అద్భుతమైన హిట్ సినిమాలను తెలుగు సినిమా పరిశ్రమకు అందించింది అని చెప్పొచ్చు. ఈ బ్యానర్లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పుష్ప 2 తెరకెక్కుతుంది. పుష్ప సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ కి తీసుకెళ్ళింది పుష్ప సినిమా.
అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ట్ చేసింది ఈ సినిమా. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో వస్తున్న పెద్ద సినిమాల్లో ఇదొకటి.

- Advertisement -

ఈ ప్రొడక్షన్ హౌస్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే రంగస్థలం. రంగస్థలం సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రంగస్థలం సినిమా తర్వాత ఇప్పుడు సుకుమార్ చేస్తున్న సినిమా వరకు కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసాడు అంటే సుకుమార్ కు ఆ ప్రొడక్షన్ హౌస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా ఇదే ప్రొడక్షన్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers ) ప్రస్తుతం డబ్బులు లేక డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ది గోట్ లైఫ్ రిలీజ్ చేశారు. లాభాలు అయితే పెద్దగా రాలేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. లవ్ గురు సినిమాని కూడా రీసెంట్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్స్ లో పుష్ప సినిమా సీక్వెల్ తో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఊస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా జరుగుతుంది.

ఇకపోతే గత ఏడాది ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను రాబట్టాయి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు కొద్దిపాటి నిరాశను మిగిల్చాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా మాత్రం అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతం ఈ సినిమా ఈ ప్రొడక్షన్ హౌస్ డబ్బింగ్ సినిమాలకే పెద్ద పీట వేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు