Rajamouli: ఆ పేరంటే ఎందుకంత ఇష్టం.. వారు ఏమంటారంటే..?

Rajamouli.. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన సినీ కెరియర్ లో ప్రతి ఒక్క సినిమా కూడా తన సక్సెస్ కు ఒక మైలు రాయి అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోతున్నారు.. ఈ సినిమా పైన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.. బాహుబలి చిత్రంతో తన స్టామినా ఏంటో చూపించిన రాజమౌళి RRR చిత్రంతో ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది.

Rajamouli: Why do you like that name so much.. What are they called..?
Rajamouli: Why do you like that name so much.. What are they called..?

టాప్ డైరెక్టర్ గా రాజమౌళి..

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజమౌళి.. తెలుగు సినీ ప్రఖ్యాతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. రాజమౌళి వర్క్ లో ఎంత కఠినంగా ఉంటారో తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి కూడా అంతే ఇష్టపడుతూ ఉంటారు.. మరోవైపు ఆస్కార్ గ్రహీత ఎమ్.ఎమ్.కీరవాణి కుటుంబం, రాజమౌళి కుటుంబం ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలే కలిసి సినిమాను తెరకెక్కిస్తూ ఉంటారు.. ఇక అందులో భాగంగానే కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కూడా హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సింహ మాట్లాడుతూ రాజమౌళి గురించి పలు విషయాలను వెల్లడించారు.

రాజమౌళిని అలా పిలుస్తాం..

రాజమౌళిని ఎక్కువగా బాబా అని పిలుస్తూ ఉంటాను. వరుసకు రాజమౌళి మాకు బాబాయి అవుతారు.. ఈ పదాన్ని షార్ట్కట్ గా బాబా అని పిలుస్తూ ఉంటామని.. అలా పిలవడమే రాజమౌళి బాబాయికి చాలా ఇష్టం అని కూడా తెలియజేశారు. మరి ఈ విషయం తెలిసిన రాజమౌళి అభిమానులు ఈ విషయాన్ని మరింత వైరల్ గా చేస్తున్నారు. మరి రాబోయే సినిమా ఈవెంట్లలో లేకపోతే బయట రాజమౌళి కనిపిస్తే ఇలా పిలుస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం రాజమౌళికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

- Advertisement -

రాజమౌళి సినిమాలు..

ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి SSMB -29 చిత్రంతో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించ బోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ , ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి లోపు ఈ సినిమాని మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మొత్తానికైతే తన సినిమాలతో తన పరిధిని పెంచుకుంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిస్తూ వారి క్రేజ్ దక్కించుకుంటున్నారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించబోతున్నట్లు సమాచారం ఆఫ్రికా నదుల నేపథ్యంలో థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు