Tollywood : టాలీవుడ్ స్టార్లకు దిష్టి తగిలిందా? ఏంటీ వరుస ప్రమాదాలు?

దర్శక ధీరుడు రాజమౌళి ఆయన కుటుంబ సభ్యులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను తెగ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మరి ఇంతకీ టాలీవుడ్ స్టార్స్ ఎందుకు ఇలా వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు?

టాలీవుడ్ స్టార్లకు దిష్టి తగిలిందా?
ట్రిపుల్ ఆర్ మూవీ స్క్రీనింగ్ కోసం రాజమౌళి ఇటీవలే తన కుటుంబంతో కలిసి జపాన్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఫ్యామిలీ జపాన్ లో ఉన్న హోటల్ లోని 28వ అంతస్తులో స్టే చేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా రాజమౌళి కుటుంబ సభ్యులు అంతా భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా కార్తికేయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సడన్ గా బిల్డింగ్ కదులుతున్నట్టుగా అనిపించిందని, భూకంపం వచ్చిందని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టిందని ఆయన చేసిన ట్వీట్ టాలీవుడ్ సినీ ప్రియులను టెన్షన్ పెట్టేస్తోంది. తామంతా భయపడ్డప్పటికీ తమ చుట్టూ ఉన్న జపనీయులంతా అదేదో నార్మల్ గా వర్షం పడుతుంది అన్నట్టుగా లైట్ తీసుకున్నారని కార్తికేయ తెలియజేశారు. ఇక తమకు ముందుగానే భూకంపానికి సంబంధించిన ఎమర్జెన్సీ అలర్ట్ కూడా వచ్చిందంటూ దానికి సంబంధించిన పిక్ ను షేర్ చేశారు. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా ఈ ఏడాది ప్రమాదం బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల పలువురు హీరోయిన్లు విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఏంటీ వరుస ప్రమాదాలు?
రాజమౌళి కుటుంబం జపాన్ లో భూకంపం సంభవించినప్పటికీ సేఫ్ గానే ఉన్నారు. ఇక ఇటీవల హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రద్ధ దాస్, సురభి విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రష్మిక మందన్న, శ్రద్ధా దాస్ 2024 ఫిబ్రవరి 17న ముంబై నుండి హైదరాబాద్ కు వెళ్తున్న విస్తారా ఫ్లైట్ లో ప్రయాణించారు. అయితే అనుకోకుండా ఆ విమానంలో టెక్నికల్ ఇష్యూ రావడంతో విమానాన్ని అత్యవసరంగా టేకాఫ్ అయిన 30 నిమిషాలకే తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. రష్మిక మందన్న శ్రద్ధాదాస్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసి “ఎస్కేప్డ్ డెత్” అంటూ తమకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని వెల్లడించింది. ఇక రీసెంట్ గా హీరోయిన్ సురభి కూడా జస్ట్ మిస్ చావు నుంచి తప్పించుకున్నామని, ఊహించుకుంటేనే భయంగా ఉందంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇది కూడా విమానంలో సాంకేతిక లోపం కారణంగానే జరిగింది.

- Advertisement -

కానీ సమయానికి పైలట్ సురక్షితంగా ఫ్లైట్ ని ల్యాండ్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు సురభి. కానీ ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది అనేది మాత్రం తెలియరాలేదు. దీంతో టాలీవుడ్ స్టార్స్ కి మాత్రమే ఎందుకిలా జరుగుతోంది? అనే అనుమానం మొదలైంది. టాలీవుడ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందేమో, టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏవైనా ప్రత్యేక పూజలు చేయించండి అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా ఒకే ఏడాది ఇంతమంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి రావడం అనేది ఆందోళనకరమే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు