Award for Hanuman : హనుమాన్ చిత్రానికి ఫస్ట్ అవార్డు అందుకున్న ప్రశాంత్ వర్మ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ప్రతి పండుగకు సినిమాలు విడుదలవుతూ మంచి సక్సెస్ ను అందుకుంటూ.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఉంటాయి.. అలా టాలీవుడ్ లో కూడా ప్రతి ఏడాది విడుదలవుతూ పలు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలలో హనుమాన్ ( Hanuman ) సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రం ఎలాంటి బజ్ లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల చిత్రాలతో పోటీపడి మరీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక అవార్డును కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.. వాటి గురించి తెలుసుకుందాం.

వాయు వేగంతో దూసుకుపోతున్న హనుమాన్..

హనుమాన్ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.. ఇందులో హీరోగా తేజ సజ్జా నటించగా.. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించారు.. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ ( Hanuman ) చిత్రం రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఇటీవల ఓటీటీలోకి కూడా అడుగుపెట్టిన హనుమాన్ సినిమా పలు రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది. భారీ వ్యూస్ రాబడుతున్న హనుమాన్ మూవీకి తాజాగా బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు రావడంతో ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పంచుకున్నారు.

- Advertisement -

బెస్ట్ డైరక్టర్ గా అవార్డ్..

Award for Hanuman
Award for Hanuman

ఈ విషయాన్ని డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ హనుమాన్ సినిమాకి మొదటి అవార్డు అందుకున్నాము.. థాంక్యూ రేడియో సిటీ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు ప్రశాంత్ వర్మ.. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సైతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని అభిమానులు సైతం తెలుపుతున్నారు..

ప్రశాంత్ వర్మ సినిమాలు..

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయానికే వస్తే.. అనుపమ పరమేశ్వరన్ తో కలిసి ఆక్టోపస్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు.. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాని మధ్యలో ఆపేసి ఇప్పుడు కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి ఆక్టోపస్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత జై హనుమాన్ సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు