Hero Allari Naresh : తెలుగు హీరోపై ఇళయరాజా కాపీరైట్ కేసు… నోటీసులు వస్తాయంటారా..?

Allari Naresh’s Aa Okkati Adakku : ఇళయరాజా ప్రస్తుతం మ్యూజిక్ ను పక్కన పెట్టి… కాపీ రైట్ కేసులు వేస్తున్నారు. తాను మ్యూజిక్ ఇచ్చిన సాంగ్స్ ను తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారు అంటూ కోర్టు మెట్లు ఎక్కడాలు, అక్కడ ఆయనపై కోర్టు మొట్టికాయాలు వేయ్యడం ఈ మధ్య జరుగుతుంది. అయినా, ఇళయరాజా ఎక్కడా తగ్గడం లేదు. తాను మ్యూజిక్ అందించిన పాటలను తన పర్మిషన్ లేకుండా వాడుకుంటున్నారు అంటూ కాపీ రైట్ కేసు కింద నోటీసులు ఇస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోకు ఇళయరాజా కాపీ రైట్ కేసు కింద నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. ఎవరా హీరో..? నోటీసులు ఎందుకు ఇస్తారు అని అనుకుంటున్నారా..? అల్లరి నరేష్ ఆ హీరో. ఈ కేసు ఎందుకంటే…

ఈ రోజు అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ ఈ ఆ ఒక్కటి అడక్కు అనే మూవీతో మరోసారి తనలో ఉన్న కామెడియన్ ను ఆడియన్స్ కు చూపించాలని అనుకున్నాడు. అలా సినిమాలో… “నేను మారిపోయాను… సీరియస్ అయిపోయాను… అని అనుకున్నారా…? నాలో కామెడీ ఇంకా అలాగే ఉంది” అంటూ ఓ డైలాగ్ కూడా పెట్టేశాడు.

- Advertisement -

ఈ సినిమా డైలాగ్‌లు రివ్యూలన్నీ పక్కన పెడితే, సినిమాలో ఓ పాట ఉంది. 1992లో అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ డైరెక్షన్ లో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీలో రాజాధి రాజాది.. అనే సాంగ్ ను ఈ రోజు రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీలో ఓ సందర్భంలో వాడారు. అల్లరి నరేష్ తండ్రి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో పాటను వాడితే తప్పేంటి అంటారా..?

డైరెక్షన్ ఈవీవీనే. కానీ, ఆ పాటకు మ్యూజిక్ ఇచ్చింది మాత్రం ఇళయరాజా. ఈయన గారు ప్రస్తుతం తన మ్యూజిక్ తో వచ్చిన సాంగ్స్ ను తన పర్మిషన్ లేకుండా వాడుకుంటున్నారు అంటూ కేసులు వేస్తున్నారు కదా… అలా అల్లరి నరేష్ పైన ఈ రోజు రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీ టీంపై కాపీ రైట్ కేసు వేసే అవకాశం ఉందని, లీగల్ నోటీసులు పంపించే ఛాన్స్ ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు