Mahesh’s Guntur Kaaram: ట్రోల్స్ కి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన మహేష్..!

Mahesh’s Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తున్న కారణంగా ఈ సినిమా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ తో ట్రేండింగ్ లో ఉండాల్సింది పోయి ట్రోల్స్ రూపంలో ట్రెండ్ అవుతూ ఉన్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. ఈ క్రమంలో గుంటురు కారం ట్రోల్స్ పై తనదైన స్టైల్ లో గట్టి కౌంటర్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్యాప్ దొరికితే ట్రిప్స్ వెళ్లి వస్తుంటారు కదా, ఆ హాలిడే ట్రిప్స్ మీద పెట్టిన శ్రద్ధతో సగం సినిమా షూటింగ్ మీద పెట్టుంటే ఈ సినిమా పూర్తయ్యేది కదా అంటూ వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కౌంటర్ ఇచ్చాడు మహేష్.

తనకు సమయం దొరికినప్పుడల్లా హాలిడేస్ కి వెళ్తుంటానని, షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినా, పిల్లలకి సెలవులు వచ్చినా చిన్న చిన్న ట్రిప్స్ కి వెళ్ళటం అలవాటని, అయినా తాను ట్రిప్స్ కి వెళ్తే మిగతావాళ్లకు వచ్చిన నష్టం ఏంటని అన్నాడు మహేష్ బాబు. నేను ట్రిప్స్ కి వెళ్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తేనే కాదా అందరికి తెలిసేది, బహుశా వాటిని చూసి జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో అని సమాధానం ఇచ్చాడు మహేష్.

అంతే కాకుండా గుంటూరు కారం రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు మహేష్. షూటింగ్ డిలే అవుతున్న కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై నెలకొన్న అనుమానాలు అన్నిటికీ ఒక్క ఆన్సర్ తో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ అవుతుందని కన్ఫార్మ్ చేసాడు మహేష్ బాబు. మొత్తానికి ఓ కార్పొరేట్ కంపెనీ తరఫున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు మహేష్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు