Lokesh Kanagaraj: శృతి హాసన్ కోసం పెద్ద నిర్ణయమే తీసుకున్నాడుగా..?

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాటిక్ యూనివర్స్ తో రాబోయే సినిమాలపై కూడా ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేశారు అయితే ఇప్పుడు ఈయన ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ కోసం నటుడిగా మారబోతున్నాడు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా లోకేష్ కనగరాజ్, శృతిహాసన్, కమలహాసన్ ముగ్గురు ఉన్నటువంటి ఒక ఫోటో కమలహాసన్ నిర్మాణ సంస్థ నుంచి రిలీజ్ అవ్వడంతో వీరి కాంబోలో సినిమా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది..

శృతి కోసం లోకేష్ కనగరాజు..
శృతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ అలాగే సంగీత దర్శకురాలు కూడా.. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ని రిలీజ్ చేసిన ఈమె తాజాగా తన నాన్న కమలహాసన్ నిర్మాణ సంస్థ అయిన RKFI ప్రొడక్షన్స్ లో కమలహాసన్ ఒక పాటని రాయగా శృతిహాసన్ సంగీత దర్శకత్వంలో దానిని స్వరపరచగా లోకేష్ కనగరాజు నటుడిగా షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇనిమెల్ అనే పేరుతో ఈ ప్రైవేట్ ఆల్బమ్ ని చిత్రీకరిస్తున్నారట లోకేష్ కనగరాజ్ అలాగే శృతిహాసన్..

నటుడిగా మారిన లోకేష్ కనగరాజు..
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇన్ని రోజులు దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా ఎలా మెప్పిస్తాడో అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.. అలాగే శృతిహాసన్ అభిమానులు కూడా ఈ కొత్త ఇనిమెల్ ఆల్బమ్ పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ పాట ఎప్పుడు వస్తుందో చూడాలి.. మొత్తానికైతే ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

- Advertisement -

లోకేష్ కనగరాజ్..
2017లో తమిళంలో విడుదలైన మానగరం అనే సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన 2021లో మాస్టర్ , 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. దర్శకుడిగా , స్క్రీన్ రైటర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ గతేడాది లియో చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత దర్శకుడిగా మారి ఇప్పుడు తన వరుస సినిమాటిక్ ప్రపంచంలో అభిమానులను తేలేలా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఖైదీ సీక్వెల్ చేసే పనిలో పడ్డారు లోకేష్ కనగరాజు..

శృతిహాసన్..
తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ 2020లో రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది.. గత ఏడాది ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు