Tollywood : ఫేక్ స్టేట్మెంట్లతో నాగార్జునను కూడా లాగుతున్న రాజకీయ నాయకులు..

Tollywood : దేశంలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగనున్నాయని తెలిసిందే. కొన్ని రాష్ట్రల్లో ఎంపీ ఎలెక్షన్లు జరుగుతూ ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో ఎంపీ తో పాటు అసెంబ్లీ ఎలెక్షన్లు కూడా జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా హడావిడి జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతుంది. అక్కడి పల్లెటూరి నుండి పట్నం దాకా వివిధ పార్టీ ల రాజకీయనాయకులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ లో ఇప్పటికే ఎమ్మెల్యే ఎలెక్షన్లు జరగగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే తో పాటు ఎంపీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడి టాలీవుడ్ కి కూడా బాగానే అంటుకుంది. ఇక సౌత్ లో సినిమాల నుండి వచ్చిన వారు రాజకీయాల్లో కూడా ముందు నుండి రాణిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో పలువురు సినీ ప్రముఖులు రాజీకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

బరిలో సినీ సెలెబ్రిటీలు..

ఇక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎలెక్షన్లలో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవనున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ టిడిపి తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక నటి రోజా వైసీపీ పార్టీ నుండి బరిలో నిల్చున్నారు. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సినిమా ఆర్టిస్టులు చాలా మంది తమకు నచ్చిన అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సినీ నటి నమిత బిజెపి తరపున ప్రచారం చేస్తుంది. అలాగే జబర్దస్త్ సినిమా నటులు సుధీర్, గెటప్ శీను వంటి నటులు జనసేనకు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళే కాకుండా మెగాహీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలోకి దిగారని తెలిసిందే. ఇక హీరో నిఖిల్ సిద్ధార్థ్ జనసేన తో పాటు, కూటమి పార్టీలకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. అయితే సపోర్ట్ చేసే వరకు బాగానే ఉంది. కానీ కొన్ని రాజకీయ పార్టీ ల నాయకులు అవసరం లేకున్నా సినిమా ఆర్టిస్టులని బలవంతంగా రాజీకీయాల్లోకి లాగుతున్నారు.

అనవసరంగా నాగ్ ని కూడా లాగుతున్నారు..

అయితే తాజాగా సినిమా(Tollywood) ఆర్టిస్టులను రాజకీయాల్లోకి అనవసరంగా లాగుతున్నారు. తమకి అవసరం లేకున్నా, పలు సెలెబ్రిటీలను సోషల్ మీడియా ద్వారా తమ పార్టీలకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇక ఈ విషయంలో నాగార్జునని కూడా మధ్యలోకి లాగారు. కింగ్ నాగార్జున దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటాడని తెలిసిందే. కానీ ఈ మధ్య ఎలెక్షన్ల నేపథ్యంలో నాగార్జున ఓ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు, ఫేక్ స్టేట్మెంట్లు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇది ఫేక్ స్టేట్మెంట్ అని సినిమా ఆర్టిస్టుల సంఘం నుండి సమాచారం వచ్చింది. ఒక్క నాగార్జుననే కాదు మహేష్ బాబు వంటి స్టార్స్ ని కూడా సోషల్ మీడియా లో విపరీతంగా వాడుకుంటున్నారు. ఇలాంటివి నమ్మొద్దని అభిమానులు సైతం ప్రజల్ని వేడుకుంటున్నారు. ఇక మరో పది రోజుల్లో ఎలాగూ ఎలెక్షన్లు అయిపోతాయి కాబట్టి, అప్పటివరకు ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటే చాలు అని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు